Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా పై చర్చించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: చంద్రబాబు డిమాండ్

కరోనా పై చర్చించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: చంద్రబాబు డిమాండ్
పార్టీ నేతలతో చంద్రబాబు వర్చువల్ భేటీ
ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు
కొవిడ్ పరిస్థితులపై చర్చించాలని సూచన
అందరికీ టీకా ఇవ్వాలని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొవిడ్ స్థితిగతులపై ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని, తాజా పరిణామాలపై చర్చించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంకా అనేక అంశాలపై చంద్రబాబు స్పందించారు.

కరోనా బాధితులకు ఇస్తున్న సాయం, ఇతర అంశాలపై జగన్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.
ఆక్సిజన్ అందక మరణించిన వారి సంఖ్య విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి.
కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేసే విషయంలో ఏ చర్యలు తీసుకున్నారో వివరించాలి.
ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.
కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు సాయం చేస్తామన్న సర్కారు, తన మాట నిలుపుకోవాలి.
కరోనా మృతులకు గౌరవప్రదంగా ప్రభుత్వమే దహనసంస్కారాలు నిర్వహించాలి.
ఇతర కారణాలతో మరణించిన కరోనా రోగుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఇవ్వాలి.
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం చేయాలి.
కరోనా సంక్షోభ సమయంలో వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
కరోనా ఔషధాలు, ఆక్సిజన్ సరఫరా, ఆసుపత్రుల్లో పడకల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి.

Related posts

సీఎం వస్తున్నారు… పెళ్లి కోసం బుక్ చేసుకున్న ఫంక్షన్ హాల్ ఇవ్వలేమన్న నిర్వాహకులు…

Drukpadam

భూముల పరిహారం పెంచాలంటే రైతులపై కేసులు …యూ పీ ప్రభుత్వ నిర్వాకం…

Drukpadam

ఏపీ రాజధాని అమరావతే: రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం

Ram Narayana

Leave a Comment