Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

కేసీఆర్‌ పాలన పిల్లి కళ్లుమూసుకొని పాలు తాగిన చందంగా ఉంది: వై.ఎస్‌.షర్మిల…

కేసీఆర్‌ పాలన పిల్లి కళ్లుమూసుకొని పాలు తాగిన చందంగా ఉంది: వై.ఎస్‌.షర్మిల…
కేసీఆర్ కళ్లు, చెవులు మూసుకొని పాలన సాగిస్తున్నారు
కేటీఆర్‌కూ ప్రజల కరోనా బాధలు పట్టడం లేదు
రెమ్‌డెసివిర్‌ను అధిక ధరకు అమ్ముతున్నా పట్టింపు లేదు
గారడీ మాటలు ఆపాలని కేసీఆర్‌, కేటీఆర్‌కు హితవు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్.షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు, కేసీఆర్ కళ్లు, చెవులు మూసుకొని పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ‘చిన్న సార్‌’గా అభివర్ణించిన ఆమె.. ఆయనకు ప్రజల కరోనా కష్టాలు అసలే కనపడడడం లేదన్నారు. కరోనా వేళ రాష్ట్రంలో ప్రజలు ఆక్సిజన్ ,మందులు , వ్యాక్సిన్ దొరక్క ఇబ్బందులు పడుతుంటే ఆరోగ్యశాఖకు జబ్బుచేసిందన్నారు. కరోనా సమయంలో ఆ శాఖా మంత్రి తనకు నచ్చటంలేదని భూకబ్జా ఆరోపణలతో తొలగించారని ఇదా ఆయనకు సమయం అని అన్నారు.

కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న రెమ్‌డెసివిర్‌ కోసం జనం భారీ క్యూలు కడుతున్నారని, అయినా తెలంగాణ ప్రభుత్వానికి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రూ. 3,500 విలువ చేసే ఒక్కో ఇంజక్షన్ రూ. 40 వేలకు అమ్ముతున్నారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా.. ప్రభుత్వానికి మాత్రం పట్టడం లేదని మండిపడ్డారు. ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మరణిస్తుంటే తమకేమీ పట్టనట్లు ఉంటున్నారన్నారు. ‘తండ్రీ కొడుకులు తమ గారడి మాటలను పక్కన పెట్టి, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి’ అని షర్మిల హితవు పలికారు.

Related posts

పంజాబ్ సీఎం భ‌గవంత్‌కు షాక్‌… సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి!

Drukpadam

ఎంపీగా ప్రజ్ఞా ఠాకూర్‌ ఎలా కొనసాగుతున్నారు?: నటి స్వర భాస్కర్!

Drukpadam

ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అసెంబ్లీ లో జోగి రమేష్ ఫైర్…

Drukpadam

Leave a Comment