Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

ముంబై అమిత్ షా సభలో ఎండదెబ్బకు 11 మృతి 50 అస్వస్థత …!

ముంబై అవార్డుల వేడుకలో అపశ్రుతి.. వడదెబ్బతో 11 మంది మృతి!

నవీ ముంబైలో భారీ ఎత్తున నిర్వహించిన సభ
కేంద్ర హోంమంత్రి, మహారాష్ట్ర సీఎం హాజరు

గ్రౌండ్ లో కుర్చీలే తప్ప ఒక్క టెంటు కూడా వేయని వైనం

జనాలను మిట్టమధ్యాహ్నం ఎండలో కూర్చోబెట్టడంతో ఘటన

మహారాష్ట్ర రాజధాని ముంబైలో అట్టహాసంగా నిర్వహించిన అవార్డుల ఫంక్షన్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఫంక్షన్ కు వచ్చిన వారిలో 11 మంది వడదెబ్బ తగలడంతో ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది వరకు ఆసుపత్రిలో చేరారు. మిట్ట మధ్యాహ్నం ఫంక్షన్ నిర్వహించడం, టెంట్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు.

మహారాష్ట్రలో సామాజిక ఉద్యమకారుడు అప్పాసాహెబ్ ధర్మాధికారికి ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు అందజేయడానికి ఆదివారం నవీ ముంబైలోని ఓ గ్రౌండ్ లో అధికారులు వేదికను సిద్ధం చేశారు. భారీ సంఖ్యలో కుర్చీలు వేసినా ఒక్కటంటే ఒక్క టెంట్ కూడా వేయలేదు. ధర్మాధికారి అభిమానులు వేల సంఖ్యలో సభకు హాజరయ్యారు. ఉదయం 11:30 కు మొదలైన సభ మధ్యాహ్నం 1 గంట వరకూ కొనసాగింది. కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో సభకు హాజరైన జనంలో కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. ఆసుపత్రికి తరలించేలోపే వారిలో 11 మంది చనిపోయారని, మరో 50 మందికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారని పోలీసులు తెలిపారు. ముంబైలో ఆదివారం 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, దీంతో చాలామంది అస్వస్థతకు గురయ్యారని వివరించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అవార్డుల ఫంక్షన్ కు వచ్చి పదకొండు మంది చనిపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.

నవీ ముంబైలో దారుణం.. ట్రాఫిక్ పోలీసును కారు బానెట్‌పై 20 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్

  • కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో తనిఖీలు
  • అనుమానాస్పదంగా కనిపించిన కారు డ్రైవర్‌ను ఆపే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ పోలీసు
  • ఢీకొట్టి వేగం పెంచిన కారు డ్రైవర్
  • నిందితుడు మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు గుర్తింపు
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
Driver Held For Dragging Traffic Cop On Car Bonnet in Navi Mumbai

తనను ఆపేందుకు ప్రయత్నించిన ఓ ట్రాఫిక్ పోలీసును ఢీకొట్టిన కారు డ్రైవర్ అతడిని ఏకంగా 20 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో కోపర్‌ఖెరాణె-వాశీ మార్గంలో శనివారం తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో అటువైపుగా వస్తున్న ఓ కారు డ్రైవర్‌ను అనుమానించిన ట్రాఫిక్ పోలీసు సిద్ధేశ్వర్ మాలిక్ (37) సహచర పోలీసుతో కలిసి ఆ కారును ఆపే ప్రయత్నం చేశాడు. గమనించిన కారు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వారిని ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లాడు. దీంతో సిద్ధేశ్వర్ ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు. అయినప్పటికీ కారును ఆపని డ్రైవర్ మరింత వేగం పెంచి పోనిచ్చాడు. దీంతో సిద్ధేశ్వర్ కారు బానెట్‌ను గట్టిగా పట్టుకుని కిందపడిపోకుండా జాగ్రత్త పడ్డాడు.

దాదాపు 20 కిలోమీటర్ల దూరం పోనిచ్చిన తర్వాత కారు డ్రైవర్ వేగం తగ్గించడంతో గవ్హాన్ ఫాటా ప్రాంతంలో సిద్ధేశ్వర్ కిందపడ్డాడు. అప్పటికే కారును వెంబడించిన పోలీసులు కిందపడిన సిద్ధేశ్వర్‌ను రక్షించారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిని 22 ఏళ్ల ఆదిత్య బెంబ్డేగా గుర్తించారు. ఆ తర్వాత అతడికి జరిపిన వైద్య పరీక్షల్లో మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు తేలింది. హత్యాయత్నం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్, మాదక ద్రవ్యాల చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Related posts

పరిటాల సిద్ధార్థ బ్యాగులో తూటా.. శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం!

Drukpadam

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట…జగన్ సంచలన నిర్ణయాలు!

Drukpadam

వనమా వెంకటేశ్వరరావు రాజీనామాకు సిద్దపడుతున్నారా…?

Drukpadam

Leave a Comment