Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఒక్క సెకనులో కరోనా టెస్ట్ … ఫ్లోరిడా వర్సిటీ సరికొత్త సాంకేతికత…

ఒక్క సెకనులో కరోనా టెస్ట్ … ఫ్లోరిడా వర్సిటీ సరికొత్త సాంకేతికత…
అత్యంత వేగంగా కరోనా టెస్టు
బయో సెన్సర్ స్ట్రిప్ తో కరోనా పరీక్షలు
వ్యక్తి లాలాజలంతో వ్యాధి నిర్ధారణ
కొత్త విధానంతో సమయం, ఖర్చు ఆదా
కరోనా వచ్చిన తరువాత ప్రపంచ వ్యాపితంగా దీనిపై కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు . మహమ్మారికి సవంత్సరం తరువాత గాని వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. కానీ ఇప్పడు అత్యంత వేగంగా జబ్బులను తెలుసుకుందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి ఫలితాలను ఇస్తుంది.అందులో భాగంగానే అమెరికా దేశం లోన్ ఫ్లోరిడా యూనివర్సిటీ కి చెందిన వారు చేసిన అధ్యనం లో ఒక్క సెకండ్ లో స్టిఫ్ ద్వారా నాలుక మీద ఉన్న లాలాజలంతో ఇట్టే కరోనా పాజిటివ్ ఉంది లేనిది చెప్పగలరు.
ప్రస్తుతం కరోనా టెస్టులు చేస్తే ఫలితం కోసం ఒక రోజు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే, ఒక్క సెకనులో కరోనా ఉందో, లేదో చెప్పేసే సరికొత్త పరీక్ష విధానానికి అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం పరిశోధకులు రూపకల్పన చేశారు. అత్యంత వేగంగా కరోనా ఫలితం తెలిపే సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు.

ఈ కొత్త విధానంలో బయో సెన్సర్ స్ట్రిప్ ద్వారా కరోనా పరీక్షలు చేస్తారు. కరోనా లక్షణాలున్న వ్యక్తి లాలాజలం ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. బయో సెన్సర్ స్ట్రిప్ గ్లూకోజ్ టెస్ట్ స్ట్రిప్ ను పోలి ఉంటుందని ఫ్లోరిడా వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. తాము రూపొందించిన కొత్త విధానంతో కరోనా పరీక్షల సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు.

Related posts

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు!

Drukpadam

టీచర్ జాబ్ కోసం కౌన్సిలర్ పదవికి రాజీనామా!

Drukpadam

సమ్మె చేసిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను మెచ్చుకున్న కేటీఆర్!

Drukpadam

Leave a Comment