Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కృష్ణపట్నం ఆయుర్వేద మందు పంపిణీకి బ్రేక్ :శాస్త్రీయత కావాలన్నా సీఎం జగన్…

కృష్ణపట్నం ఆయుర్వేద మందు పంపిణీకి బ్రేక్ :శాస్త్రీయత కావాలన్నా సీఎం జగన్
-ఆనందయ్య కరోనా మందు పంపిణి నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటన
-కరోనాను కట్టడి చేస్తుందంటూ ప్రచారం
-ప్రజల నుంచి విశేష స్పందన
-మందు శాంపిళ్లను హైదరాబాద్ పంపిన అధికారులు
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై సీఎం జగన్ కూడా దృష్టి సారించి, శాస్త్రీయ అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. దీనిపై నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు వివరణ ఇచ్చారు.
మూలికా ఔషధం పంపిణీ ఆపివేశామని, ఈ ఔషధం తాలూకు శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని వెల్లడించారు. దీనిపై ఐసీఎంఆర్ శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే… ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు. అప్పటివరకు మందు పంపిణీకి అనుమతి లేదని స్పష్టం చేశారు.

 

ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ మంత్రి, ఐసీఎంఆర్ డీజీలకు ఉపరాష్ట్రపతి సూచనలు

Venkaiah Naidu responds on Nellore Ayurvedic medicine issue
  • ఆనందయ్య కరోనా మందుకు విపరీతమైన డిమాండ్
  • కృష్ణపట్నంకు పోటెత్తుతున్న ప్రజలు
  • జాతీయస్థాయిలో చర్చనీయాంశమైన వైనం
  • స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ కోసం ఇస్తున్న ఆయుర్వేద మందుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆనందయ్య ఆయుర్వేద వైద్యం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని అన్నారు. ఈ మేరకు కేంద్ర ఆయుష్ ఇన్చార్జి మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్ కు సూచనలు చేశారు.

కిరణ్ రిజిజు, బలరామ్ భార్గవ్ లకు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు నెల్లూరు ఆయుర్వేద ఔషధంపై వారితో చర్చించారు. వెంటనే అధ్యయనం ప్రారంభించాలని, సాధ్యమైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ చూపాలని వారికి తెలిపారు.

Related posts

మహమ్మారి సమయంలో దేశంలో లెక్కలోకి రాని మరణాలు 49 లక్షలు!

Drukpadam

కరోనా వ్యాక్సిన్ తీసుకోకుంటే తెలంగాణాలో నో రేషన్ , నో పెన్షన్ “సర్కార్ నిర్ణయం!

Drukpadam

కరోనా మహమ్మారి అంతమవుతుందని అనుకోవద్దు.. మరిన్ని వేరియంట్లు పుడతాయి: డబ్ల్యూహెచ్ వో

Drukpadam

Leave a Comment