Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్!

ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్!
పరిషత్ ఎన్నికలను రద్దు చేసిన హైకోర్టు
ఎసీఈసీ తీరును తప్పుపట్టిన న్యాయస్థానం
నీలం సాహ్నిపై పిటిషన్ వేసిన రేగు రమేశ్

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. తీర్పు సమయంలో ఎస్ఈసీ నీలం సాహ్నిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అర్థం చేసుకోవడంలో కూడా విఫలమయ్యారని విమర్శించింది. ఎస్ఈసీగా ఆమె అర్హతను కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించింది.

మరోవైపు ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈమె నియామకం సరైనది కాదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను రేగు రమేశ్ అనే వ్యక్తి దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు… ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్ పై విచారణ కొనసాగుతుందని తెలిపింది.

జగన్ ప్రభుత్వంలో నీలం సాహ్ని తొలుత సీఎస్ గా పని చేశారు. ఆ తర్వాత ఆమె పదవీ విరమణ చేశారు. అనంతరం జగన్ ఆమెను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ పదవీకాలం ముగిసింది. దీంతో, ఆమెను నిమ్మగడ్డ స్థానంలో ఎస్ఈసీగా నియమించారు.

ఎస్ఈసీగా ఆమె పదవీ బాధ్యతలను చేపట్టిన వారం రోజుల వ్యవధిలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం పది రోజుల వ్యవధిలోనే పోలింగ్ జరిగింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నోటిఫికేషన్ కు, పోలింగ్ కు మధ్య నాలుగు వారాల వ్యవధి ఉండాలని, సుప్రీం ఆదేశాలను తుంగలో తొక్కారంటూ ఎస్ఈసీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలను రద్దు చేసింది.
జడ్పీటీసీ ,ఎంపీటీసీ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పు విషయంలో రకరకాల వాదనలు ఉన్నాయి.ఎన్నికల సందర్భంగా సింగిల్ బెంచి రెండురోజుల ముందు ఎన్నికలు నిలిపివేయాలని తీర్పునివ్వగా డివిజన్ బెంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కోర్ట్ తీర్పు ప్రకారమే ఎన్నికలు జరిగాయి.అయితే ఎన్నికలు జరపడానికి అనుమతినిచ్చిన కోర్ట్ కౌంటింగ్ ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది.అందువల్ల రాష్ట్రప్రభుత్వం తిరిగిగి డివిజన్ బెంచ్ కి వెళ్లే ఆవకాశం ఉంది.వేసవి సెలవుల తరువాత నీలం సహానీ విషయంపై వాదనలు వింటామని హైకోర్టు కేసును వాయిదా వేస్తూ రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు పంపింది.

Related posts

వందేళ్ల క్రితం నాటి రామప్ప దేవాలయం.. సోషల్​ మీడియాలో ఫొటో చక్కర్లు!

Drukpadam

శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత.. మరింతగా దిగజారిన పరిస్థితి…

Drukpadam

ఖమ్మం ఐ ఎం ఎ ఆధ్వర్యంలో టెలిమెడిసిన్ -అందుబాటులో 31 మంది డాక్టర్లు

Drukpadam

Leave a Comment