Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఏపీ డీజీపీ ని వదలని సైబర్ నేరగాళ్లు ……

ఏపీ డీజీపీ ని వదలని సైబర్ నేరగాళ్లు ……
ఏపీ డీజీపీ పేరుతో ట్విట్టర్ నకిలీ ఖాతా తెరిచిన సైబర్ నేరగాళ్లు
డీజీపీ ఫొటో పెట్టి దందాకు తెరలేపిన సైబర్ నేరగాళ్లు
ఫేక్ అకౌంట్ ను ఫాలో అవుతున్న పలు జిల్లాల ఎస్పీలు
కేసు నమోదు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
టెక్నాలజీ పెరిగిన తర్వాత మనిషి జీవితమే మారిపోయింది. మరోవైపు అదే టెక్నాలజీని వాడుతూ, జనాలను అందినకాడికి దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తున్నారు. వీరి బారిన రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా పడ్డారు. తాజాగా సైబర్ నేరగాళ్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతాను తెరిచారు. గౌతమ్ సవాంగ్ పేరుతో ట్విట్టర్ ఖాతాను తెరిచి… ఆయన ఫొటో పెట్టి దందాకు తెరలేపారు.

ఈ ఖాతా నుంచి పలు ట్వీట్లు కూడా చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అది నిజంగా డీజీపీ ఖాతానే అనుకుని పలు జిల్లాల ఎస్పీలు కూడా ఆ అకౌంట్ ను ఫాలో అవుతున్నారు. అయితే చివరకు దీన్ని డీజీపీ కార్యాలయం గుర్తించింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న విజయవాడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై దృష్టి సారించారు.

Related posts

ఉప్పల్‌లో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌: పాకిస్థాన్–న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‌ కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!

Ram Narayana

వివేకానందరెడ్డి హత్య కేసు.. మాజీ డ్రైవర్‌ను ఏడు గంటలపాటు విచారించిన సీబీఐ…

Drukpadam

ప్రధాని కాన్వాయ్ ని అడ్డుకున్నది మేమే: భారతీయ కిసాన్ యూనియన్ !

Drukpadam

Leave a Comment