Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సువేందు అధికారి గెలుపును హైకోర్టులో సవాల్‌ చేసిన మమతా బెనర్జీ!

సువేందు అధికారి గెలుపును హైకోర్టులో సవాల్‌ చేసిన మమతా బెనర్జీ!
నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగిన కీలక నేతలు
ఎన్నికల ఫలితాల రోజు నాటకీయ పరిణామాలు
1700 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందిన సువేందు
తుది ఫలితాలపై దీదీ అనుమానం

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి స్వల్ప మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ దీదీ కోల్ కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీరివురు నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

మే 2న జరిగిన ఓట్ల లెక్కింపు సందర్భంగా నందిగ్రామ్‌ కౌంటింగ్‌ సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి 11 రౌండ్లలో అధికారి వెనుకంజలో ఉన్నప్పటికీ.. తర్వాత నాలుగు రౌండ్లలో ఆయన అనూహ్యంగా పుంజుకున్నారు. ఓ దశలో ఏకంగా 11 వేల ఓట్ల తేడాతో ముందంజలో కొనసాగారు.

దీనిపై దీదీ అనేక అనుమానాలు లేవనెత్తారు. కౌంటింగ్‌ సమయంలో నాలుగు గంటల పాటు సర్వర్‌ డౌన్‌ అయ్యిందని.. ఆ సమయంలో అవకతవకలు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. తాను గెలుపొందానని.. దానికి గవర్నర్‌ సైతం శుభాకాంక్షలు తెలియజేశారని పేర్కొన్నారు. కానీ, ఒక్కసారిగా ఫలితాలన్నీ తారుమారయ్యాయని వాపోయారు. రీకౌంటింగ్‌ కోరినప్పటికీ ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు. అప్పట్లోనే దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. రీకౌంటింగ్ కోసం టీఎంసీ కార్యకర్తలు పట్టుపట్టినప్పటికీ ఎన్నికల అధికారులు అంగీకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి .

Related posts

ప్రొద్దుటూరు 1వ టౌన్ మహిళా ఎస్‌ఐపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

Ram Narayana

కాశీ నుంచి డిబ్రూగఢ్… 4 వేల కిలోమీటర్ల రివర్ క్రూయిజ్!

Drukpadam

రూ.20 కే భోజనం.. విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్…

Ram Narayana

Leave a Comment