అఘోరాలు ఎవరు? వారు శవాలతో సహవాసం ఎందుకు చేస్తారు..?
నాగసాధువులు అఘోరాలకు మధ్య తేడా ఏమిటి …??
మహా కుంభ మేళా అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆధ్యాత్మిక వేడుక
మహా కుంభమేళా దేశమే కాదు ప్రపంచవ్యాపితంగా చర్చనీయాంశంగా ఉంది …ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ వద్ద గంగా,యమునా ,సరస్వతి అనే మూడు నదులు కలిసే పవిత్ర ప్రదేశమైనందున దీన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు ..ఇక్కడకు సాధువులు ,నాగసాధువులు , అఘోరాలు వచ్చి పుణ్యస్నాలు ఆచరించడం ప్రత్యేకత …వారు ఎక్కడ నుంచి వస్తారో ఎవరికీ తెలియదని అంటారు …నాగసాధువులు , అఘోరాలు చూడటానికి అతి భయంకరంగా ఉంటారు …మేడలో దండాలు , మనిషి పుర్రెలు ,శరీరానికి బూడిద పూసుకొని, ఒంటిమీద వస్త్రాలు సైతం సరిగా లేకుండా కనిపిస్తారు ..చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు సైతం వారిని చూసి భయపడతారు ..వాస్తవంగా వారు ఎవరికీ హాని తలపెట్టారు … భక్తులకు దీవెనలు అందజేస్తారు … అఘోరి అంటేనే సంస్కృతంలో భయంలేనివాడని అర్ధం…వీరు శివభక్తులు …వారిని కలవగానే హరిహర మహాదేవ అని సంబోధిస్తారు …
మహా కుంభ మేళా అంటే ఏమిటి …?

మహా కుంభ మేళా… 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది … ఇది ప్రపంచం లోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక.ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వద్ద గంగా,యమునా ,సరస్వతి అనే మూడు నదులు కలిసే పవిత్ర ప్రదేశమైనందున దీన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు… త్రివేణి సంగమంలో కోట్లాది మంది పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.మన దేశం నుండే కాక ప్రపంచంలో అన్ని దేశాల నుండి ప్రజలు ఈ మహా కుంభ మేళా లో పాల్గొని పవిత్ర స్నానం ఆచరించేందుకు తరలి వస్తున్నారు.ఈ కుంభ మేళా లో సాధారణ భక్తులతో పాటు దేశ నలు మూలల నుండి సాధువులు కూడా అమృత స్నానం ఆచరిస్తారు…ఇక్కడ పుణ్యస్నానాలు చేయడం ద్వారా ముక్తి కలుగుతుందని ,మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం …అక్కడకు కోట్లాది మంది పుణ్య స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు … దేశ విదేశాల నుంచి 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ..ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది…
మహా కుంభ మేళా కు ప్రధాన ఆకర్షణ అంటే నాగ సాధువులు,అఘోరి సాధువులు అనే చెప్పాలి.ఎక్కడ ఉంటారో తెలియదు,ఎలా జీవిస్తారో అసలే తెలీదు.కానీ ఎక్కడ ఉన్నా ప్రతి కుంభమేళాకి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి భక్తులకు ఆశీర్వాదం అందించి వెళ్తారు.అయితే నాగ సాధువులకు,అఘోరి సాధువులకు ఉన్న వ్యత్యాసం ఏంటో మీకు తెలుసా.
ఇద్దరూ ఆరాధించేది పరమ శివుడినే

నాగ సాధువులు,అఘోరి సాధువులు ఇద్దరూ ఆరాధించేది పరమ శివుడినే. ఈ పరమ శివుడి అనుగ్రహం కోసం 12 సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేస్తారు.వీరిద్దరూ పూజించేది శివున్ని అయినప్పటికీ ఇద్దరూ తమదైన శైలిలో ఆరాధన చేస్తారు.వీరు చేసే తపస్సు కూడా భిన్నంగా ఉంటుంది
నాగ సాధువుల ఆరాధనా విధానం

నాగ సాధువులు శైవ సంప్రదాయాలను అను నిత్యం పాటిస్తారు.వీరు ముఖ్యంగా బిల్వ పత్రం, బూడిద ,నీరు వంటి వాటిని శివలింగానికి అర్పించి శివుడికి పూజా చేస్తారు.ధ్యానం,యోగా వంటి పద్ధతుల ద్వారా శివునిలో మమేకం అవుతారు.ఈ రెండిటి ద్వారా నిత్యం శైవ భక్తిలో మునిగిపోతారు.
అఘోరి సాధువుల ఆరాధనా విధానం
ఇక అఘోరి సాధువులు పూజించేది కూడా శివుడినే అయినప్పటికి వీరి ఆరాధనా విధానం,వీరి భక్తి మామూలు జనాలకి కొంచం విపరీతంగా అనిపిస్తుంది. వీరు ఆచరించే పూజా విధానాలు మూడు రకాలుగా ఉంటాయి .అవి శివ సాధన,శవ సాధన ఇంకా శ్మశాన సాధన.శివ సాధనలో ఒంటికాలిపై నిలబడి శివుడికి పూజలు చేస్తారు.ఇక శవ సాధన లో మాంసాహారం,మద్యాన్ని శివుడికి నైవేద్యంగా అర్పిస్తారు.శ్మశాన సాధన లో హవనం వంటి పద్దతులతో శివుణ్ణి పూజిస్తారు.ఇక వీరు దత్తాత్రేయ స్వామి వారిని తమ గురువుగా భావిస్తారు.శివుని ద్వారా మోక్ష మార్గాన్ని పొందవచ్చు అని వీరు బలంగా నమ్ముతారు.
నాగ సాధువుల జీవన విధానం
ఈ నాగ సాధువుల సంప్రదాయ జీవనానికి ఆదిశంకరాచార్యను గురువుగా పరిగణిస్తారు.నాగ సాధువులు బ్రహ్మచర్యం పాటించడం తో పాటు పరిత్యాగానికి చిహ్నంగా నగ్నంగా తిరుగుతూ ఉంటారు.మనుషులను,మతాన్ని రక్షించడం వీరి ప్రధాన బాధ్యత.నాగ సాధువుగా మారడానికి దాదాపు 14 సంవత్సరాలు పడుతుంది.అందులో మొదటి ఏడు సంవత్సరాలు చాలా ప్రధానమైనవి.నాగ సాధువులుగా మారాలనుకునే వారికి బ్రహ్మచర్యం నేర్పించి యజ్ఞోపవేతం వేస్తారు.అలానే వారి కుటుంబ సభ్యుల ముందు పిండి దాన్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు
అఘోరి సాధువుల జీవన విధానం

అఘోరీలు పూజించేది శివుడినే..అయితే వారు కాళీ మాత ని కూడా శివుని తో పాటు సమానంగా ఆరాధిస్తారు.అలానే కాపాలికాచారాన్ని పాటిస్తారు.అఘోరీలు మంత్ర తంత్రాల్ని అభ్యసిస్తారు.మద్యం తీసుకోవడం,మాంసం తినడం వీరి ఆచారంలో ఒక భాగం.తమ శరీరాలకు ఎప్పుడూ బూడిద రాసుకుని ఉంటారు.రుద్రాక్ష దండలు,మనుషుల పుర్రెలను ఒంటిపై ధరిస్తారు.నాగ సాధువుల మాదిరి కాకుండా వీరు ఏకాంతంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు. మహా కుంభ మేళా వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వీరు బయట ప్రపంచంలోకి వస్తూ ఉంటారు.ఎక్కువగా వీరు శ్మశాన వాటికలలో నివసిస్తూ ఉంటారు
వీరి ఆహారపు అలవాట్లు
నాగ సాధువులు రోజుకి ఒక్క సారి మాత్రమే ఆహారం తీసుకుంటారు.ఇక వీరు ఆహారాన్ని భిక్ష ద్వారా సేకరించుకుంటారు.ఒక రోజుకి ఏడు ఇండ్ల నుండి మాత్రమే భిక్ష అడగాలి అన్న కఠిన నియమాలను పాటిస్తారు.ఒకవేళ వారు భిక్ష అడిగిన ఏడు ఇండ్ల నుండి ఆహారం లభించకపోతే ఆరోజు పస్తులు ఉంటారు.ఇక అఘోరి సాధువులు మాంసాహారాన్ని స్వీకరిస్తారు.వారి వారి పద్ధతులను అనుసరించి కొంత మంది నల్లని దుస్తులు ధరిస్తారు ఇక మరికొంత మంది నగ్నంగానే ఉంటారు
అఘోరా అంటే సాధు జీవనంలోనే ఉన్నతమైన స్థితిగా వారు అభివర్ణిస్తూ ఉంటారు. వీరు బేధభావాలను నమ్మరు. వీరి పట్ల హిందూ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. కుంభమేళాలు, పుష్కరాలలో మాత్రమే వీరు ఎక్కువగా కనిపిస్తుంటారు.
అఘోరాలు ఎవరు? ఈ ప్రశ్న చాలామందికి చిక్కుముడే. వారు ఎప్పుడూ స్మశానాల్లోనే తిరుగుతూ ఉంటారు. కాలే కాష్టాల మధ్య కాలం వెళ్లదీస్తూ ఉంటారు. మనుషుల పుర్రెలను పట్టుకుని సంచరిస్తూ ఉంటారు. దాన్ని ఒక పాత్రగా వివిధ పనులకు ఉపయోగిస్తారు. శరీరమంతా బూడిద ఉంటుంది.. ఒంటిపై వస్త్రాలు ఉండవు. మెడలో రుద్రాక్ష మాలలు ధరిస్తారు. శివుడ్ని అమితంగా ఆరాధిస్తారు. గంజాయి తాగుతూ కనిపిస్తూ ఉంటారు. శవాలపై కూర్చుని ధ్యానం చేస్తుంటారు. వీరికి మంచీ చెడులు ఒక్కటే. బాహ్య ప్రపంచానికి చాలా ఎడం పాటిస్తూ ఉంటారు. కుంభమేళా జరిగేటప్పుడో లేదా దేవాలయాల్లో ఏవైనా ప్రత్యేక పూజలు సమయంలో పెద్ద ఎత్తున ఆ ప్రాంతాలకు తరలివస్తూ ఉంటారు. సంస్కృతంలో అఘోరీ అంటే ‘భయం కలిగించని’ అని అర్థం కానీ. కానీ అఘోరాల వేషధారణ, ప్రవర్తన భీతిగొల్పుతూ ఉంటుంది. హిందూ సమాజంలో వీరిని దేవ ధూతలుగా భావిస్తారు. అఘోరాల్లో పురుషులే ఉంటారు. మహిళలు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. దేవునితో ఏకం కావడానికి వీరు సాధారణ నియమాలను దాటి తమదైన ప్రత్యేక పద్ధతులను అవలంభిస్తారు. మన దేశంలో ఎంతమంది అఘోరాలు ఉన్నారన్న అంశంపై స్పష్టత లేదు కానీ వేలల్లో ఉండొచ్చని ఓ అంచనా.
అఘోరాల్లో కొందరు నరమాంసాన్ని భక్షిస్తారు. మృతదేహాలతో సంభోగిస్తామని కొందరు చెబుతుంటారు. కొందరు వేశ్యలతో శృంగారంలో పాల్గొంటారు. కానీ స్వలింగ సంపర్కాన్ని అస్సలు ఆమోదించరు. వీరిలో కొందరికి కామరూప, పరకాయ ప్రవేశ విద్యలు కూడా వచ్చు అంటుంటారు. నాలుగు వందల ఏళ్ల క్రితం వారణాసిలో జీవించిన బాబా కీనారం అనే సాధువుల పరంపరగా ఇప్పటి అఘోరాలు అనే ఓ కథ ప్రచారంలో ఉంది. వీరు తమ జీవిత కాలమంతా మోక్ష సాధన లక్ష్యంగా ధ్యానంలో ఉంటారు. అతి జుగుప్సాకరమైన పద్దతిన వీరు మోక్ష సాధన మార్గం ఉంటుంది. హిమాలయ మంచు గుహలు, కాశీ క్షేత్రం, బెంగాల్, గుజరాత్ అడవుల్లో వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు.