Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పోలీస్ గౌరవం మరింత పెంపొందించేలా పని చేయాలి : డిజిపి మహేందర్ రెడ్డి…

పోలీస్ గౌరవం మరింత పెంపొందించేలా పని చేయాలి : డిజిపి మహేందర్ రెడ్డి
రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులతో వర్చువల్ సమావేశం
-ప్రజల్లో నమ్మకం మన్నన పొందేలా సేవలు ఉండాలి
-అనేక నేరాలు అరికట్టడంలో తెలంగాణ పోలిసుల తీరు భేష్
-అధికారులు మరింత ఉత్సాహంగా పని చేయాలి
-ఖమ్మం నుంచి పాల్గొన్న సీపీ విషు ఎస్ వారియర్

దేశంలో తెలంగాణ పోలీసులకు ఉన్న గౌరవం, కీర్తిని మరింత పెంపొందించే విధంగా పోలీస్ అధికారులంతా మరింత ఉత్సాహంగా పని చేయాలని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు.

మంగళవారం ఆయన పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేసుల విచారణ, దర్యాప్తు, కోర్టులలో శిక్షల శాతం, పెట్రోలింగ్ వాహనాల పనితీరు, స్టేషన్ రైటర్లు, రిసెప్షన్, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ వర్టీకల్స్ విభాగాలను ఆయన సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం అన్ని స్థాయిల అధికారులు సమర్ధవంతంగా పనిచేస్తూ నిందితుల అరెస్ట్ చేయడం, న్యాయస్థానాల ద్వారా శిక్షలు పడే విధంగా చేయడం, తద్వారా ప్రజలలో పోలీసుల పట్ల నమ్మకాన్ని మరింత పెంచడం, ప్రజా మన్ననలు పొందేలా విధి నిర్వహణ చేయాలని సూచించారు.

నేరాల నియంత్రణకు జిల్లాలో చేపట్టిన చర్యలను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ వివరించారు.

సైబర్ నేరాల అదుపు లక్ష్యంగా సైబర్ వారియర్ 2.0 ఆవిష్కరణ
పెరిగిపోతున్న సైబర్ నేరాలను అదుపు చేయడంతో పాటు ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అవగాహన కల్పించడం, అన్ని స్థాయిల పోలీస్ అధికారులకు సైతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అవగాహన కల్పించడం లక్ష్యంగా రూపొందించిన ఇన్వెస్టిగేటర్స్ డైరెక్టరీ ఫర్ సైబర్ వారియర్స్ 2.0 పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో అనుభవజ్ఞులైన సైబర్ నిపుణుల ద్వారా ఎన్నో విషయాలను పొందుపరచడం జరిగిందని డిజిపి తెలిపారు.

ఈ సందర్భంగా ఫంక్షనల్ వర్టీకల్ అమలులో 2020-21 లో ఉత్తమ ఫలితాలు సాధించిన 223 పోలీస్ స్టేషన్లకు, అధికారులకు అవార్డులు, పురస్కారాలను అందజేశారు.

వీడియో కాన్ఫరెన్స్ లో డీసీపీ ఇంజరాపు పూజ, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్,
అడిషనల్ డీసీపీ ప్రసాద్, అడిషనల్ డీసీపీ (AR) కుమారస్వామి, ఏఎస్పీ స్నేహ మెహ్రా , ఏసీపీ ప్రసన్న కుమార్పాల్గొన్నారు.

Related posts

బీజేపీ, జనసేన పొత్తు సంకేతాలు బలంగా వినిపించాలి: పార్టీ నేతలకు పురందేశ్వరి సూచన

Ram Narayana

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం… రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Drukpadam

నైజీరియా మసీదులో 12 మందిని కాల్చి చంపిన దుండగులు..

Drukpadam

Leave a Comment