Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ పోలీసులపై సిపిఐ రామకృష్ణ ఫైర్!

ఏపీ పోలీసులపై సిపిఐ రామకృష్ణ ఫైర్!
-పోలీసులే రాజ్యమేలుతున్నారని విమర్శ
-జగన్ ప్రభుత్వం గాలికి కొట్టుకుపోయింది
-జనాల ఇళ్లకు వెళ్లి పోలీసులు దాడి చేస్తున్నారు
-సీపీఐ నాయకులను కొట్టడాన్ని ఖండిస్తున్నాం
-ఎస్సై మునిప్రతాప్ ను విధుల నుంచి తొలగించాలి

ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం గాలికి కొట్టుకుపోయిందని… ప్రభుత్వంలో పోలీసులే రాజ్యమేలుతున్నారని అన్నారు. పోలీస్ యూనిఫామ్ ఇచ్చింది దౌర్జన్యాలు చేయడానికి కాదని చెప్పారు. జనాల ఇళ్లకు వెళ్లి పోలీసులు దాడి చేస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. న్యాయం అడిగితె దాడులు చేస్తారా ? ఇదేనా జగన్ సర్కార్ పనితీరు ,పోలీసులకు పాలనా అప్పగించి కళ్లప్పగించి చేయుస్తుందని ధ్వజమెత్తారు . తమ కార్యకర్తలను స్థానిక ఎస్ ఐ విషక్షణారహితంగా కొట్టారు . కొట్టే అధికారం ఎస్ ఐ కి ఎవరు ఇచ్చారని రామకృష్ణ ప్రశ్నించారు .

సీపీఐ నాయకులను కొట్టడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. స్టేషన్ కు వెళ్లి న్యాయం అడిగితే బట్టలు ఊడదీసి కొట్టడం దారుణమని అన్నారు. పోలీసు దాడిలో గాయపడిన బాధితులను ఆదోని ఆసుపత్రిలో రామకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సై మునిప్రతాప్ ఉద్యోగంలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. మునిప్రతాప్ ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు చంపే పనులను కూడా మొదలు పెట్టారని మండి పడ్డారు .

Related posts

కేసీఆర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది: షర్మిల సంచలన వ్యాఖ్యలు !

Drukpadam

ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ దన్ను…

Drukpadam

ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్నే సీఎం జగన్ అమలు చేస్తున్నారు: ధర్మాన!

Drukpadam

Leave a Comment