Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్​గా బండా ప్రకాశ్​ ఎన్నిక ఏకగ్రీవం!

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్​గా బండా ప్రకాశ్​ ఎన్నిక ఏకగ్రీవం!

  • అభినందించిన సీఎం కేసీఆర్
  • ప్రకాశ్ ఈ పదవి చేపట్టడం అందరికీ గర్వకారణం అని వ్యాఖ్య
  • ముదిరాజ్ ల అభివృద్ధికి కృషి చేశారన్న సీఎం కేసీఆర్

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మండలిలో డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎన్నిక జరిగింది. ప్రకాశ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ను సీఎం కేసీఆర్ అభినందించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి మండలిలో డిప్యూటీ చైర్మన్ కూర్చీలో కూర్చొబెట్టారు.

ప్రకాశ్ ఈ పదవి చేపట్టడం  కావడం అందరికీ గర్వకారణం అన్నారు. సామాన్య కుటుంబం నుంచి ప్రకాశ్ ఎదిగారని, ముదిరాజ్ ల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. 1981లో మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించిన బండా ప్రకాశ్ 2017లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు.

Related posts

మహేష్​ను ఓదార్చి, పక్కనే ఉన్న బాలకృష్ణను పలకరించిన ఏపీ సీఎం జగన్​!

Drukpadam

అభివృద్ధిలో జర్నలిస్టుల సహకారం మరువలేనిది…మంత్రి సింగిరెడ్డి

Drukpadam

పెట్రో రేట్ల దొంగ దెబ్బ ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తీ …లీటర్ కు రూ 15 పెంపు ?

Drukpadam

Leave a Comment