Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీలో కానీ, ఆర్ఎస్ఎస్‌లో కానీ చేరితే పది రోజుల్లోనే బెయిలు వస్తుందన్నారు: అఖిల్ గొగొయ్ సంచలన ఆరోపణ!

బీజేపీలో కానీ, ఆర్ఎస్ఎస్‌లో కానీ చేరితే పది రోజుల్లోనే బెయిలు -వస్తుందన్నారు: అఖిల్ గొగొయ్ సంచలన ఆరోపణ
-జైలు నుంచే పోటీ చేసి విజయం సాధించిన అఖిల్
-ఉపా చట్టం కింద నమోదైన కేసుల్లోనూ నిర్దోషిగా తేలిన వైనం
-బీజేపీలో చేరితే మంత్రి పదవి వస్తుందని ఎన్ఐఏ ఆఫర్ చేసిందన్న గొగొయ్
-సీబీఐ, ఈడీలానే ఎన్ఐఏ కూడా రాజకీయ సంస్థగా మారిందని ఆరోపణ

వ్యవస్థలను మేనేజ్ చేయడం వారికే వ్యతిరేకంగా ఉన్నవారిని లొంగదీసుకోవడం అనేది పాలకులకు కొత్తకాదు … అసోం లో అదే జరిగింది .బీజేపీ పాలిత రాష్ట్రమైన అసోం లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల వెనక అఖిల్ గొగొయ్ హస్తం ఉండనే ఆరోపణలపై 2019 లో నేషనల్ ఇన్వెస్టుగేషన్ ఏజన్సీ అరెస్ట్ చేసింది. 2021 జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన జైలు నుంచే పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఎన్ ఐ ఏ రెండు కేసులు అతనిపై నమోదు చేసింది . అనేక సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు.బీజేపీ లోగాని ఆరెస్సెస్ లోగాని చేరితే కేసులు ఉండవని 10 రోజుల్లోనే బెయిల్ వస్తుందని ఎన్ ఐ ఏ అధికారులు తెలిపినట్లు ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. 

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద అరెస్ట్ అయి జైలు నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన అసోంకు చెందిన రైజోర్ దళ్ అధినేత, ఆర్టీఐ కార్యకర్త అఖిల్ గొగొయ్ సంచలన ఆరోపణలు చేశారు.

జైలు నుంచి విడుదలైన అనంతరం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ.. తాను బీజేపీలోకి కానీ, ఆర్ఎస్ఎస్‌లో కానీ చేరితే పది రోజుల్లోనే బెయిలు వస్తుందని, లేదంటే పదేళ్లపాటు జైలులోనే గడపాల్సి వస్తుందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తనను హెచ్చరించిందని సంచలన ఆరోపణ చేశారు. అంతేకాదు, బీజేపీలో చేరితే మంత్రి పదవి కూడా వస్తుందని ఆఫర్ చేసిందన్నారు.

అయితే, ఎన్ఐఏ ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు చెప్పారు. ఉపా చట్టం కింద తనపై నమోదైన రెండు అభియోగాలను కోర్టు కొట్టివేయడాన్ని చారిత్రాత్మకమైన తీర్పుగా పేర్కొన్న అఖిల్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ఐఏను ఓ అస్త్రంగా వాడుకుంటోందన్నారు. సీబీఐ, ఈడీలానే ఎన్ఐఏ కూడా ఓ రాజకీయ సంస్థలా మారిపోయిందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2019 డిసెంబరులో అసోంలో జరిగిన హింసాత్మక ఘటనల వెనక అఖిల్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఎన్ఐఏ రెండు అభియోగాలు నమోదు చేసింది. అఖిల్ ఇప్పటికే ఓ కేసులో నిర్దోషిగా తేలగా, రెండో కేసులోనూ గురువారం నిర్దోషిగా తేలడంతో జైలు నుంచి విడుదలయ్యారు.

Related posts

రేపు మధ్యాహ్నం తర్వాత టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు నుంచి మాయమవబోతున్నారు: రేవంత్ రెడ్డి!

Drukpadam

సేవ్ లక్షద్వీప్ …రిమూవ్ ప్రఫుల్ పటేల్ :సముద్రగర్భంలో ప్లకార్డులతో ఆందోళన…

Drukpadam

జైల్లో పెట్టినా ,నిషేదించిన నాపోరాటం ఆగదు…రాహుల్ గాంధీ…!

Drukpadam

Leave a Comment