Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు విద్యార్థుల య‌త్నం.. ఉద్రిక్త‌త‌…

మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు విద్యార్థుల య‌త్నం.. ఉద్రిక్త‌త‌…
-నారాయణపేట జిల్లాలో కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌
-ఏబీవీపీ కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు
-పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్
-కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు, దేవుడితో కూడా కొట్లాడతమన్నా కేటీఆర్
-టెక్స్ టైల్ పార్కుకు శంకుస్థాపన
-కృష్ణానదీ జలాలపై వ్యాఖ్యలు

తెలంగాణ‌ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ రోజు నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు ప్ర‌య‌త్నించారు. అయితే, ఏబీవీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్క‌డి నుంచి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేయ‌డంతో కాసేపు ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో టీఆర్ఎస్ స‌ర్కారు నిర్ల‌క్ష్య ధోర‌ణిని విడనాడాల‌ని వారు నినాదాలు చేశారు.

కాగా, త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కేటీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నారాయణపేట ప్రభుత్వ ఆసుప‌త్రిలో 10 ఐసీయూ పడకలు, 3 వెంటిలేటర్లతో కూడిన చిన్నారుల వార్డును ప్రారంభించారు. అలాగే, వెజ్, నాన్వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. అమరవీరుల స్మారక ఉద్యానవనంతో పాటు సింగారం క్రాస్ రోడ్డులో చేనేత కేంద్రం ప‌నుల‌ను కూడా ఆయ‌న ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

కృష్ణానదీ జలాలపై వ్యాఖ్యలు

ఈ సందర్భంగా ఆయన కృష్ణా నదీ జలాల వివాదంపై స్పందించారు. కృష్ణా నదీ జలాల విషయంలో తాము ఎవరితోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం తమకు రావాల్సిన నీటి కేటాయింపుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు, అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు పరమావధి అన్నారు.

కేటీఆర్ నేడు నారాయణపేటలో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్ టైల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోరిన మీదట, రూ.10 కోట్లతో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు శ్రీకారం చుడుతున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.

Related posts

బద్వేల్ బీజేపీ అభ్యర్థి సురేష్ ….

Drukpadam

రాహుల్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలి … దేశంలోని ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారు :జైరామ్ రమేశ్!

Drukpadam

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాకు ప్రధాని సానుకూలం :గులాంనబీ ఆజాద్…

Drukpadam

Leave a Comment