Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ క్షమాపణ చెప్పి, నేలకు ముక్కు రాయాలి: వైయస్ షర్మిల!

కేసీఆర్ క్షమాపణ చెప్పి, నేలకు ముక్కు రాయాలి: వైయస్ షర్మిల!
దేశంలో అత్యధిక నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి
కేసీఆర్ మొద్దు నిద్రను వీడటం లేదు
దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలి
-షర్మిల రాకకు ముందు రోజే మంత్రి భాదిత కుటుంబానికి పరామర్శ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో అత్యధికంగా నిరుద్యోగులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని… అయినా కేసీఆర్ మొద్దునిద్రను వీడటం లేదని అన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నా దున్నపోతుపై వాన పడినట్టు కేసీఆర్ తీరు ఉందని దుయ్యబట్టారు. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాటిపర్తి గ్రామంలో ఈరోజు ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఆత్మహత్యకు పాల్పడిన కొండల్ కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా ఆమె పరామర్శించారు. దీక్షను ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడుతూ సీఎంపై విమర్శలు గుప్పించారు.

ఉద్యోగాల నోటిఫికేషన్లు అంటూ ప్రకటన చేసిన కేసీఆర్… ఇదే సమయంలో 50 వేల మంది ఉద్యోగులను పీకేశారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాసి దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్షలు చేపడతామని చెప్పారు.

ముందు రోజే మంత్రి నిరంజన్ రెడ్డి భాదిత కుటంబానికి పరామర్శ ….

తాడిపత్రికి చెందిన కొండల్ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించనున్నారు. బాధిత కుటుంబీకుల సమక్షంలో ప‌గ‌లంతా.. ఆమె నిరాహారదీక్ష చేయ‌నున్నారు. అయితే.. ష‌ర్మిల దీక్ష విష‌యం తెలిసి టీఆర్ఎస్ పార్టీ అల‌ర్ట్ అయింది. ష‌ర్మిల రాక‌కు ముందే.. సోమ‌వారం మంత్రి నిరంజ‌న్‌రెడ్డి కొండల్ కుటుంబాన్ని పరామర్శించ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తి రేపుతోంది.

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామంలో ఉద్యోగ నోటిఫికేషన్ రావ‌డం లేదంటూ ఇటీవ‌ల కొండ‌ల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవ‌డం జిల్లాలో క‌ల‌క‌లంగా మారింది. ఈ విష‌యం తెలిసి ష‌ర్మిల మంగ‌ళ‌వారం కొండ‌ల్ ఇంట్లో దీక్ష‌కు సిద్ద‌మ‌య్యారు. ష‌ర్మిల దీక్ష‌కు కౌంట‌ర్‌గా అన్నట్టు.. తాజాగా మంత్రి నిరంజ‌న్‌రెడ్డి కొండ‌ల్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు రూ. లక్ష చెక్కు అందజేశారు. కొండల్ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. యువత క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని.. ప్రభుత్వం దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి తెలిపారు. త్వరలో భారీ నోటిఫికేషన్లు రానున్నాయని విద్యార్థులు ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు. …
అటు.. ష‌ర్మిల నిరుద్యోగ‌ నిరాహార దీక్ష‌.. ఇటు మంత్రి నిరంజ‌న్‌రెడ్డి ఓదార్పు యాత్ర‌తో తాడిప‌ర్తి గ్రామంలో రాజ‌కీయ హ‌డావుడి నెల‌కొంది…

Related posts

తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద నిరసన … అడ్డుకున్న పోలీసులు…

Drukpadam

సీఎం పదవి దగ్గరే జనసేన ,టీడీపీ పార్టీలకు చిక్కు …

Drukpadam

“కాంగ్రెస్’ను ట్విట్టర్ బయో నుంచి తీసేసిన హార్దిక్ పటేల్

Drukpadam

Leave a Comment