Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ఘనతంతా షమీదే.. ఆ బౌన్సరే నాలోని ఆటగాడిని లేపింది.. హార్దిక్ పాండ్యా!

ఘనతంతా షమీదే.. ఆ బౌన్సరే నాలోని ఆటగాడిని లేపింది.. హార్దిక్ పాండ్యా

  • -హార్దిక్ తలకు తగిలిన షమీ విసిరిన బౌన్సర్
  • -అంతకుముందు వరకు ఇబ్బంది పడ్డానన్న ఆల్ రౌండర్
  • -40 పరుగులతో విజయంలో కీలక పాత్ర

ఎట్టకేలకు ముంబై ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫాంను అందుకున్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో తాను ఎంత ప్రమాదకర ఆటగాడో మరోసారి నిరూపించాడు. అయితే, తాను అంత మంచి ఇన్నింగ్స్ ఆడడానికి కారణం ప్రత్యర్థి జట్టు బౌలర్ మహ్మద్ షమీనే అంటున్నాడు హార్దిక్. ఓ బౌన్సర్ విసిరి తనలోని ఆటను షమీ మేల్కొలిపాడని హార్దిక్ అన్నాడు. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. హార్దిక్ 30 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

‘‘నా ఇన్నింగ్స్ ఘనత అంతా షమీదే. మహ్మద్ షమీ వేసిన బౌన్సర్ నా తలకు తగిలింది. వెంటనే పొలార్డ్ దగ్గరకు వెళ్లి.. ఈ బౌన్సర్ నన్ను మేల్కొలిపింది అని చెప్పా. అంతకుముందు వరకూ నేను చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత ప్రతి అవకాశం కొత్తదే అనుకుంటూ మ్యాచ్ ఆడాను’’ అని తెలిపాడు. టీమ్ ను గెలిపించే ప్రతి ఒక్కరూ హీరోనేనని హార్దిక్ పాండ్యా చెప్పాడు. గతంలో ఏం జరిగిందన్నది తనకు అనవసరమని, వంద శాతం ప్రతిభ చూపేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.

 

కీలక మ్యాచ్‌లో గెలిచి.. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకున్న ముంబై

  • -స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడినా విజయం
  • -ఏడింటిలో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టతరం చేసుకున్న పంజాబ్
  • -బ్యాటింగ్, బౌలింగులో రాణించిన పొలార్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
Pollard and Hardik get MI back to winning ways

వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి ప్లే ఆఫ్స్ ఆశలను క్లిష్టతరం చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఎట్టకేలకు ఓ విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. గత రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత తడబడినా సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా చెలరేగడంతో పంజాబ్ ఓటమి ఖాయమైంది. ముంబైకి ఇది ఐదో విజయం కాగా, ఏడింటిలో ఓడిన పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచింది. క్రిస్ గేల్ మరోమారు తీవ్రంగా నిరాశపరచగా మార్కరమ్ (42), దీపక్ హుడా (28), కెప్టెన్ కేఎల్ రాహుల్ (21) రాణించడంతో ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పొలార్డ్, బుమ్రా చెరో రెండు వికెట్లు తీసుకోగా, రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై స్వల్ప లక్ష్య ఛేదనలో తొలుత తడబడింది. 61 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి మరో ఓటమి దిశగా పయనిస్తున్నట్టు కనిపించింది. అయితే, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా చెలరేగి జట్టును విజయం దిశగా నడిపారు. తివారీ 37 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 45 పరుగులు చేయగా, పాండ్యా 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 40 పరుగులు చేశాడు.

తివారీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్ 7 బంతుల్లో సిక్సర్, ఫోర్‌తో 15 పరుగులు చేసి మిగతా పనిని పూర్తి చేశాడు. ఫలితంగా మరో ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. బంతితోను, బ్యాట్‌తోనూ మెరిసిన పొలార్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా, షమీ, నాథన్ ఎల్లిస్ చెరో వికెట్ తీసుకున్నారు. ఐపీఎల్‌లో భాగంగా నేడు దుబాయ్‌లో రాజస్థాన్ రాయల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది.

Related posts

కుల్దీప్ స్పిన్ ఉచ్చులో పాక్ విలవిల… 228 పరుగులతో భారత్ ఘనవిజయం

Ram Narayana

దంచి కొట్టిన యువజట్టు… తొలి వన్డేలో శ్రీలంకపై టీమిండియా గెలుపు…

Drukpadam

పాకిస్థాన్ తో థ్రిల్లింగ్ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటో చెప్పిన రోహిత్ శర్మ!

Drukpadam

Leave a Comment