Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

నక్కా ఆనంద్ బాబు తన వాంగ్మూలంలో పూర్తి వివరాలు చెప్పలేదు: నర్సీపట్నం సీఐ!

నక్కా ఆనంద్ బాబు తన వాంగ్మూలంలో పూర్తి వివరాలు చెప్పలేదు: నర్సీపట్నం సీఐ!
-గుంటూరు వచ్చిన నర్సీపట్నం పోలీసులు
-నక్కా ఆనంద్ బాబు నివాసం వద్ద హైడ్రామా
-గంజాయి వ్యవహారంలో వాంగ్మూలం నమోదు
-ఆధారాలు ఏమీ లేవన్న నక్కా ఆనంద్ బాబు
-నోటీసులు తీసుకోవాలన్న పోలీసులు

గంజాయి దందాపై ప్రెస్ మీట్ లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు నుంచి పోలీసులు ఎట్టకేలకు వాంగ్మూలం నమోదు చేశారు. అయితే, ఆయన వాంగ్మూలంలో పూర్తి వివరాలు వెల్లడించలేదని నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు ఆరోపించారు.

నల్గొండ జిల్లా పోలీసులు నర్సీపట్నంలో కాల్పులు జరిపారని, అదే రోజున స్మగ్లింగ్ వెనుక నేతల హస్తం ఉందని ఆనంద్ బాబు చెప్పారని సీఐ వివరించారు. అందుకే ఆధారాలు ఇవ్వాలని అడిగామని తెలిపారు. ప్రస్తుతం వాంగ్మూలం నమోదు చేశామని, కానీ ఆధారాలు ఏమీ లేవని ఆనంద్ బాబు అంటున్నారని సీఐ శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇస్తామంటే తీసుకోలేదని వెల్లడించారు. వాంగ్మూలంలో చెప్పిన అంశాలు సమగ్రంగా లేనందునే నోటీసులు ఇస్తున్నామని సీఐ అన్నారు.

కాగా, పోలీసులు తనకు బలవంతంగా నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండడంపై నక్కా ఆనంద్ బాబు మెలిక పెట్టారు. తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని తిరిగి ఇస్తేనే నోటీసులు తీసుకుంటానని స్పష్టం చేశారు. నోటీసులు తీసుకోకపోతే గోడకు అంటించి వెళతామని పోలీసులు అంటున్నారు. దాంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది.
అంతకు ముందు ఆనందబాబు వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.

గంజాయి వ్యవహారంలో నక్కా ఆనంద్ బాబు వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు

ఏపీలో గంజాయి అక్రమ రవాణా, వినియోగం అడ్డుఅదుపు లేకుండా సాగుతోందని మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఆరోపించడం, గంజాయి వ్యవహారంపై మీరు ఏ ఆధారాలతో వ్యాఖ్యలు చేశారో ఆ ఆధారాలు తమకు ఇవ్వాలంటూ నర్సీపట్నం పోలీసులు నిన్న రాత్రి గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లడం తెలిసిందే. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. విశాఖలో గంజాయి దందాకు సంబంధించి నక్కా ఆనంద్ బాబు వాంగ్మూలాన్ని పోలీసులు నేడు నమోదు చేసుకున్నారు.

ఓ ప్రెస్ మీట్ లో నక్కా ఆనంద్ బాబు గంజాయి దందాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆనంద్ బాబు ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలను పోలీసులు తీవ్రంగా పరిగణించి గత అర్ధరాత్రి ఆయన నివాసానికి చేరుకుని నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే నోటీసులు తీసుకునేందుకు ఆనంద్ బాబు నిరాకరించారు. దాంతో పోలీసులు ఈ ఉదయం మరోసారి ఆయన నివాసానికి వెళ్లారు.

కాగా, పోలీసుల తీరుపై నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓ మాజీ మంత్రినని, తన అభిప్రాయాలు చెప్పేంత స్వేచ్ఛ కూడా ఇవ్వరా? అని మండిపడ్డారు. ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా?… పోలీసులకు ఆధారాలు ఇవ్వాల్సింది మేమా? అని నిలదీశారు.

Related posts

హర్యానాలో డిఎస్పీ ని హత్య చేసిన మైనింగ్ మాఫియా …

Drukpadam

నమ్మినవారు ముంచేశారంటూ.. వరంగల్‌లో బీజేపీ నేత ఆత్మహత్య!

Drukpadam

డీసీపీనే లంచం అడిగిన పోలీస్ కానిస్టేబుల్ !

Drukpadam

Leave a Comment