Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టెస్లా కు వెల్ కం బట్ వన్ కండిషన్ కార్ల తయారీ భారత్ లోనే జరగాలి!

టెస్లా కు వెల్ కం బట్ వన్ కండిషన్ కార్ల తయారీ భారత్ లోనే జరగాలి!
ముందు రండి.. భారత్ లో కార్లు తయారు చేయండి: టెస్లాకు కేంద్రం వెల్ కమ్
పన్ను ప్రయోజనాలు కల్పిస్తామన్న నీతిఆయోగ్
మస్క్ ప్రతిపాదనకు కాలం చెల్లిందని వ్యాఖ్య
కొత్త ఆలోచనతో రావాలని సూచన

ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ సంస్థ టెస్లా కంపెనీ కి భారత్ ప్రభుత్వం వెల్ కం చెప్పింది. అయితే కండిషన్ లు అప్లై అనడం కొసమెరుపు , టెస్లా కంపనీ కి చెందిన ఎలాన్ మాస్క్ విదేశాలలో తయారు చేసిన కార్లను భారత్ లో విక్రయించుకునేలా అనుమతులు ఇవ్వాలని కోరారు. అందుకు భారత్ ప్రభుత్వం ససేమీరా అన్నది . మీరు భారత్ లో కార్ల తయారు చేసుకోవడానికి విక్రయించుకోవడానికి అభ్యంతరంలేదు . అందుకు మీకు ప్రభుత్వం తరుపున స్వగతం పలుకుతున్నాం. రండి అంటూ మంచి ఆఫర్ ఇచ్చింది.భారత్ ప్రభుత్వం అవసరమైతే మీకు పన్ను రాయితీలు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది.

దేశంలో విద్యుత్ కార్లను తయారు చేయాల్సిందిగా టెస్లాను కేంద్రం కోరింది. దేశంలో తయారు చేస్తే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పన్ను ప్రయోజనాలను కల్పిస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. పబ్లిక్ ఫోరం ఆఫ్ ఇండియా నిర్వహించిన వర్చువల్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. అయితే, వేరే దేశాల్లో తయారైన కార్లను భారత్ కు తీసుకురావడం మాత్రం కుదరదని ఆయన తేల్చి చెప్పారు.

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన ఆ ప్రతిపాదనకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు. భారత్ లోనే కార్లను తయారు చేసేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని చెప్పారు. దేశంలో తయారీని ప్రారంభించాకే పన్నుల తగ్గింపుపై ఆలోచిస్తామని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, భారత్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎంటరయ్యేందుకు టెస్లా ప్రయత్నాలను చేస్తూనే ఉంది. కార్ల దిగుమతిపై సుంకాలను తగ్గించాల్సిందిగా మస్క్ విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.

Related posts

దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు భారతీయులు సహా 16 మంది సజీవ దహనం!

Drukpadam

కొత్త ఖమ్మాన్ని ఆవిష్కరించిన మంత్రి అజయ్…1100 కోట్ల నిధులతో అభివృద్ధి!

Drukpadam

చంఢీగఢ్ లో జయప్రదంగా ముగిసిన ఐజేయూ సమావేశాలు

Drukpadam

Leave a Comment