Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దళితబంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించిన శాలపల్లిలో కూడా టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ!

దళితబంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించిన శాలపల్లిలో కూడా టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ!

  • దళితబంధుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్
  • హుజూరాబాద్ లో ఎస్సీ, ఎస్టీల ఓట్లు దాదాపు 50 వేలు
  • శాలపల్లిలో 135 ఓట్ల ఆధిక్యతను సాధించిన ఈటల

టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం హుజూరాబాద్ ఉపఎన్నికలో పని చేయలేదా? ప్రస్తుతం వెడువడుతున్న ఫలితాల సరళిని చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు దాదాపు 50 వేల వరకు ఉంటారు. వీరందరిపై దళితబంధు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.

అయితే అంచనాలకు విరుద్ధంగా దళితబంధు ఓటర్లను ఆకట్టుకోకపోయిందనే భావన ఇప్పుడు వెలువడుతోంది. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరందరి సమక్షంలో భారీ బహిరంగసభలో ఈ పథకాన్ని ఆరంభించారు. పథకానికి సంబంధించి వివరాలను ఆయనే స్వయంగా వేదికపై నుంచే అందరికీ వివరించారు. అయితే, శాలపల్లిలో వెలువడిన ఫలితాలు టీఆర్ఎస్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. శాలపల్లిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 135 ఓట్ల ఆధిక్యతను సాధించారు.

Related posts

చంద్రబాబుకు ఉన్నంత సహనం నాకు లేదు.. మీ వీపులు పగులుతాయ్: నారా లోకేశ్!

Drukpadam

ఇదేమి ప్రతిపక్షం …ఇదెక్కడి భాష …ఇల్లేమి నాయకులు:సీఎం జ‌గ‌న్!

Drukpadam

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం …రాజ్యసభలో మంత్రి సమాధానం…

Drukpadam

Leave a Comment