Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

బంగారంతో కరోనా మాస్కు… ధర మామూలుగా లేదు మరి!

  • బంగారంతో కరోనా మాస్కు… ధర మామూలుగా లేదు మరి!
    కరోనా వేళ మాస్కుల వినియోగం
    బంగారంతో మాస్కు చేయించుకున్న బెంగాల్ వ్యాపారవేత్త
    108 గ్రాముల బంగారంతో మాస్కు
    ధర రూ.5.70 లక్షలుకరోనా మహమ్మారివల్ల మాస్క్ మస్ట్ అనే నినాదం ప్రపంచం అంత మరోమోగుతుంది. మాస్క్ లేకపోతె జరిమానాలు విధిస్తున్నారు. కరోనా ప్రభావం ఇంకా ఉందని అందువల్ల ప్రభుత్వం వైశ్య ఆరోగ్యశాఖ చెబుతున్న నిబంధనలు పాటించి కరోనా మహమ్మారినుంచీ రక్షణ పొందాలనే ప్రచారం కొనసాగుతుంది. దీంతో రకరకాల మాస్క్ లు అందుబాటులోకి వచ్చాయి. ముక్కు ,నోరు కప్పి ఉండేవిధంగా అనేకరకాల మాస్క్ లు వచ్చాయి . కలకత్తాకు చెందిన ఒక వ్యాపారి బంగారంతో మస్క్ తయారు చేయించుకొని ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

కరోనా వేళ మాస్కుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. మాస్కుల్లో కూడా ఎన్95, కాటన్ మాస్కులు, డిజైనర్ మాస్కులు, ప్రింటెడ్ మాస్కులు ఇలా ఎన్నో వచ్చాయి. అయితే వీటన్నింటిని మించిపోయేలా బంగారం మాస్కు వచ్చింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యాపారవేత్త పసిడి మాస్కు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు.

చందన్ దాస్ అనే నగల డిజైనర్ సాయంతో తనకిష్టమైన విధంగా బంగారంతో ఆ మాస్కును తయారుచేయించుకున్న ఆ బిజినెస్ మేన్ ఇప్పుడు ఎక్కడికెళ్లినా అందరి కళ్లు అతడిపైనే. ఈ మాస్కు కోసం 108 గ్రాముల బంగారాన్ని వినియోగించారు. దీని ఖరీదు రూ.5.70 లక్షలు. కోల్ కతాలో దుర్గాపూజ సందర్భంగా ఈ గోల్డెన్ మాస్కుతో వచ్చిన వ్యాపారవేత్తను చూసేందుకు జనం ఎగబడ్డారట.

ఈ బంగారం మాస్కు ఫొటోలను ఓ మహిళా జర్నలిస్టు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వైరల్ అయింది.

Related posts

ఎన్నికల ప్రచార వేళ అఖిలేష్ ఇంట కోవిడ్ కలకలం!

Drukpadam

ఏపీలో పాజిటివిటీ రేటు పెరగడంపై కేంద్రమంత్రి ఆందోళన…

Drukpadam

ప్రతిపక్షాల లేఖ పై బీజేపీ మండిపాటు…

Drukpadam

Leave a Comment