Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సిరివెన్నెల మృతి ప‌ట్ల సీఎం జ‌గ‌న్, చంద్రబాబు,కేసీఆర్ దిగ్భ్రాంతి!

సిరివెన్నెల మృతి ప‌ట్ల సీఎం జ‌గ‌న్, చంద్రబాబు, కేసీఆర్ దిగ్భ్రాంతి!

  • సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల అన్న జగన్
  • సాహితీ లోకానికే తీరని లోటు అన్న చంద్రబాబు
  • ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన నేతలు

ప్రముఖ సినీ గేయ రచయిత, కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి అందరినీ కలచివేస్తోంది. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ.. సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల అని కొనియాడారు. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు. ఆయన హఠాన్మరణం తెలుగువారందరికీ తీరనిలోటు అని చెప్పారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని… ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. అద్భుత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. దాదాపు 3 వేలకు పైగా పాటలు రాసి, సంగీత ప్రియులను అలరించిన పద్మశ్రీ సీతారామశాస్త్రి మరణం తెలుగు సాహితీ లోకానికే తీరని లోటు అని అన్నారు. సీతారామశాస్త్రి ఆత్మశాంతికై భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

ఆయన సాహిత్య ప్రస్థానం మూడున్నర దశాబ్దాల పాటు సాగింది: కేసీఆర్

  • ఎలాంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే సాహిత్యాన్ని సృష్టించారని కితాబు
  • ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటు అన్న కేసీఆర్
KCR praises Sirivennela

ప్రముఖ సినీ గేయ రచయిత, కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సిరివెన్నెల సృష్టించారని కొనియాడారు. పండిత, పామరుల హృదయాలను ఆయన గెలుచుకున్నారని చెప్పారు.

సినిమా పేరునే (సిరివెన్నెల) తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం… సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని అన్నారు. ఆయన మరణం తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటు అన్నారు. సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Related posts

ఈఎస్ఐ స్కాంలో రూ.144 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ!

Drukpadam

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఏళ్ల తరబడి జ‌రిగే అవకాశం: బ్రిటన్‌ విదేశాంగ మంత్రి!

Drukpadam

సంక్షోభం దిశగా బోరిస్ జాన్సన్ సర్కార్ …10 మంది మంత్రుల రాజీనామా !

Drukpadam

Leave a Comment