Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుపతి ఉప ఎన్నిక.. ప్రచారానికి తెలంగాణ బీజేపీ చీఫ్

  • తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ
  • ఆమె తరపున ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు
  • ఏప్రిల్ 14న తిరుపతి ర్యాలీకి బండి సంజయ్
Telangana BJP Chief Bandi Sanjay Will Campaign in Tirupati

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తిరుపతిలో తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.

ఇందులో భాగంగా, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీ అగ్రనేతలు సహా పలువురు సినీ స్టార్లు కూడా తిరుపతిలో ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, పలువురు తెలంగాణ బీజేపీ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటారని సమాచారం.

ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండు రోజులపాటు తిరుపతిలో తమ పార్టీ అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ 14న తిరుపతిలో జరిగే బీజేపీ ర్యాలీలోనూ ఆయన పాల్గొంటారని తెలుస్తోంది.

Related posts

వుమెన్ ట్రాఫికింగ్‍ గురించి ఎవరు చెప్పారో చెప్పండి?:పవన్ కల్యాణ్‌కు వైసీపీ లీగల్ సెల్ ప్రశ్న

Drukpadam

రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా 161 రకాల సేవలు… చంద్రబాబు!

Ram Narayana

ఉత్కంఠ‌కు తెర‌.. గెల్లు శ్రీనివాస్ టీఆర్ యస్ అభ్యర్థి ప్రకటించిన సీఎం కేసీఆర్!

Drukpadam

Leave a Comment