Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కుర్చీలతో కొట్టుకున్న న్యాయవాదులు!

ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత… కుర్చీలతో కొట్టుకున్న న్యాయవాదులు!
  • బార్ కౌన్సిల్ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశం
  • న్యాయవాదుల మధ్య భేదాభిప్రాయాలు
  • పరస్పరం ఘర్షణ
  • బార్ కౌన్సిల్ సభ్యుడు అజయ్ కుమార్ కు గాయం
  • సీజేని కలిసేందుకు న్యాయవాదుల యత్నం
Brawl at high court bar association general body meeting

ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం రసాభాస అయింది. బార్ కౌన్సిల్ ఎన్నికలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. అయితే, న్యాయవాదుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. పలువురు న్యాయవాదులు చేతికందిన కుర్చీలతో యుద్ధానికి దిగారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది.

ఈ ఘటనలో బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్ కుమార్ గాయపడ్డారు. ఆయన తలకు దెబ్బ తగిలింది. ఈ ఘర్షణల నేపథ్యంలో అజయ్ కుమార్, ఇతర న్యాయవాదులు హైకోర్టు సీజేని కలిసేందుకు యత్నించారు. కాగా, ఈ సమావేశంలో న్యాయవాదులు రాయలసీమ, కోస్తా వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగినట్టు తెలుస్తోంది. పోలీసుల జోక్యంతో న్యాయవాదులు శాంతించారు.

Related posts

కెమెరామన్‌ను రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన రష్యన్ మంత్రి!

Drukpadam

కమలా హారిస్ ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన యూఎస్ నర్స్… అరెస్ట్

Drukpadam

మహారాష్ట్రలో బస్సులో చెలరేగిన మంటలు.. 25 మంది సజీవ దహనం

Drukpadam

Leave a Comment