ఆంధ్రప్రదేశ్

యశ్వంత్ సిన్హా హైద్రాబాద్ సందర్బంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు…

యశ్వంత్ సిన్హా కు ఎంపీ రవిచంద్ర స్వాగతం

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పలువురు మంత్రులు, ఎంపీలు సిన్హా కు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయనను నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ వరకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీతో తోడ్కొని వచ్చారు. అనంతరం అక్కడ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలంతా భోజన విరామ సమయంలో సమావేశమయ్యారు. జిల్లా రాజకీయాల గురించి చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీ రవిచంద్ర కూడా పాల్గొన్నారు.

Related posts

తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ సాక్షి, సుమన్ టీవీలపై కేసుల నమోదు

Ram Narayana

టర్కీ, సిరియా దేశాల్లో భూకంపాలపై మూడ్రోజుల ముందే హెచ్చరించిన డచ్ పరిశోధకుడు…

Drukpadam

ఇలా చేస్తే మరింత ఎక్కువ లగేజీని తీసుకెళ్లొచ్చు.. 

Drukpadam