Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వచ్చే నెల నుంచి భారత్‌లో ప్రజలకు అందుబాటులోకి స్పుత్నిక్‌-వీ టీకా!

వచ్చే నెల నుంచి భారత్‌లో ప్రజలకు అందుబాటులోకి స్పుత్నిక్‌-వీ టీకా
  • భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
  • టీకా ఒక్కటే మార్గమంటున్న నిపుణులు
  • వేధిస్తోన్న టీకాల కొరత
  • ఈ తరుణంలో స్పుత్నిక్‌ అందుబాటులోకి
  • వెల్లడించిన రష్యాలోని భారత రాయబారి
India to vaccinate Sputnik V vaccine from next month

వచ్చే నెల నుంచి భారత్‌లో మరో టీకా ప్రజలకు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని రష్యాలోని భారత రాయబారి బాల వెంకటేశ్‌ వర్మ సైతం ధ్రువీకరించారు. భారత్‌లో వచ్చే నెల నుంచి స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారని గురువారం తెలిపారు.

భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ఈ వార్త రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహమ్మారి నియంత్రణకు వ్యాక్సిన్‌ ఒక్కటే తారకమంత్రం అంటున్న తరుణంలో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం నిజంగా శుభవార్త అనే చెప్పాలి. స్పుత్నిక్‌-వీ అత్యవసర వినియోగానికి ఈ నెల 12న డీసీజీఐ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రపంచంలో స్పుత్నిక్‌ వినియోగాన్ని ఆమోదించిన 60వ దేశం భారత్‌. రెండు డోసుల్లో ఇవ్వాల్సిన ఈ టీకాకు 91.6 శాతం సామర్థ్యం ఉన్నట్లు ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ లో ప్రచురితమైంది.

Related posts

జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు..

Drukpadam

అమెరికాలో పారాసెయిలింగ్ చేస్తూ ఏపీ మహిళ మృతి!

Drukpadam

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు!

Drukpadam

Leave a Comment