Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మాకు కేసీఆర్ ఉన్నారు… ఆయనే మా ధైర్యం: మల్లారెడ్డి!

మాకు కేసీఆర్ ఉన్నారు… ఆయనే మా ధైర్యం: మల్లారెడ్డి!

  • పాలు, పూలు అమ్మి ఈ స్థాయికి వచ్చానన్న మల్లారెడ్డి
  • ఈ స్థాయిలో ఐటీ రెయిడ్స్ జరగడం ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్య
  • నా కొడుకుకి కూడా నా కాలేజీలో సీటు ఇవ్వలేనన్న మంత్రి

పాలు అమ్మి, పూలు అమ్మి, బోర్లు వేసి, వ్యాపారాలు చేసి, ఎంతో కష్టపడి తాను ఈ స్థాయికి వచ్చానని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. తన జీవితం కూడా చాలా సాధారణంగా ఉంటుందని… ఖరీదైన బట్టలు వేసుకోనని, చేతికి ఒక్క ఉంగరం కూడా ఉండదని, రబ్బరు చెప్పులు వేసుకుంటానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రిననే ఒకే ఒక కారణంతో తమపై ఐటీ దాడులు చేశారని విమర్శించారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన ఐటీ అధికారులు వందల సంఖ్యలో వచ్చి రెయిడ్స్ చేయడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. తమ కుటుంబ సభ్యులను, తమ ప్రిన్సిపాళ్లను, స్టాఫ్ ను అందరినీ రెయిడ్స్ పేరుతో భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. తమ స్టాఫ్ ఇళ్లకు వెళ్లి రెయిడ్స్ చేసి, ఆ తర్వాత కాలేజీల్లో వదిలి పెట్టారని తెలిపారు. కేంద్ర బలగాలతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి దాడులకు తాను భయపడనని మల్లారెడ్డి చెప్పారు. ఐటీ, ఈడీ దాడులు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే చెప్పారని అన్నారు. తమకు కేసీఆర్ ఉన్నారని… ఆయనే తమ ధైర్యం అని చెప్పారు. అంతా కేసీఆర్ చూసుకుంటారని అన్నారు. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజుకు తమ కాలేజీల్లో మంచి విద్యను అందస్తున్నామని చెప్పారు.

కాలేజీల ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్ లైన్ ద్వారానే జరుగుతున్నాయని… అలాంటప్పుడు అక్రమాలకు చోటెక్కడుంటుందని ప్రశ్నించారు. తమ మెడికల్ కాలేజీలో మేనేజ్ మెంట్ కోటానే లేదని… ఏ, బీ, సీ కేటగిరీ సీట్లన్నీ ప్రభుత్వం నిర్వహించే కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ అవుతాయని చెప్పారు. తన విద్యా సంస్థలల్లో తన కొడుకుకి కూడా తాను సీటు ఇవ్వలేనని… తన కొడుకైనా కౌన్సిలింగ్ ద్వారానే సీటు తెచ్చుకోవాలని అన్నారు.

మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎవరి వద్ద ఎంత నగదు దొరికిందంటే..!

IT notices to minister Malla Reddy

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై నిర్వహించిన ఐటీ దాడులు ముగిశాయి. సోమవారం నాడు తమ విచారణకు హాజరుకావాలంటూ మల్లారెడ్డి సహా, ఆయన కుమారులు, అల్లుడికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఐటీ దాడుల్లో ఎవరెవరి వద్ద ఎంత నగదును స్వాధీనం చేసుకున్నారంటే.. 

  • మల్లారెడ్డి నివాసంలో – రూ. 6 లక్షలు
  • మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి నివాసంలో – రూ. 12 లక్షలు
  • మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి నివాసంలో – రూ. 6 లక్షలు
  • మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి నివాసంలో – రూ. 3 కోట్లు
  • ప్రవీణ్ రెడ్డి ఇంట్లో – రూ. 1.5 కోట్లు
  • త్రిశూల్ రెడ్డి నివాసంలో – రూ. 2 కోట్లు
  • రఘునందన్ రెడ్డి నివాసంలో – రూ. 2 కోట్లు
  • ప్రవీణ్ కుమార్ నివాసంలో – రూ. 2.5 కోట్లు
  • సుధీర్ రెడ్డి నివాసంలో – రూ. కోటి

Related posts

పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత పోరు …..ఆందోళన లో హైకమాండ్ !

Drukpadam

ఏపీ లో వివాదంగా మరీనా వంగవీటి రాధా రెక్కీ వ్యవహారం…

Drukpadam

అమరావతి రాజధాని నిర్మాణంలో భారీ అవినీతి …చంద్రబాబుకు ఐటీ నోటీసులు …అసెంబ్లీ లో సీఎం జగన్

Drukpadam

Leave a Comment