Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

బెంగాల్‌లో హింస.. నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ…

బెంగాల్‌లో హింస.. నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ…
  • ఫలితాల అనంతరం పలు చోట్ల హింసాత్మక ఘటనలు
  • ఆరుగురు కార్యకర్తలు మరణించారని బీజేపీ ఆరోపణ
  • ఇళ్లు, కార్యాలయాలనూ ధ్వంసం చేశారని ఆరోపణ
  • తృణమూల్‌ దౌర్జన్యంగా వ్యవహరించిందని విమర్శ
  • నివేదిక ఇవ్వాలని ఆదేశించిన గవర్నర్‌
MHA Sought report on post poll alliance in bengal

బెంగాల్‌లో ఆదివారం అసెంబ్లీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి బీజేపీకి చెందిన కనీసం ఆరుగురు కార్యకర్తలు మరణించారని ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఆరోపించింది. అలాగే కొన్ని వందల పార్టీ కార్యాలయాలు, ఇళ్లను ధ్వంసం చేశారని తెలిపింది. ఫలితాలు తృణమూల్‌కు అనుకూలంగా మారుతున్న కొద్దీ బీజేపీ కార్యకర్తలపై తృణమూల్‌ దౌర్జన్యం పెరిగిపోయిందని ఆరోపించింది.

ఈ ఆరోపణలపై కేంద్ర హోంశాఖ స్పందించింది. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బెంగాల్‌ ఫలితాల తర్వాత హింసకు సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

మరోవైపు ఆ రాష్ట్ర గవర్నర్‌ సైతం దీనిపై స్పందించారు. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ, కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. బెంగాల్‌లో 292 స్థానాలకు ఎన్నికలు జరగగా  213 సీట్లలో తృణమూల్‌, బీజేపీ 77, లెఫ్ట్‌-కాంగ్రెస్‌ 1, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందాయి.

Related posts

ఆఫ్ఘన్ లో వేగంగా మారుతున్నాపరిణామాలు …ప్రంపంచం చూపు అటు వైపే!

Drukpadam

అర్చకులకు, బ్రాహ్మణ విద్యార్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్…!

Drukpadam

షర్మిల ఖమ్మం సంకల్ప సభ సక్సెస్… అభిమానుల్లో జోష్

Drukpadam

Leave a Comment