Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

సెంట్రల్ జైల్లో ఖైదీలతో మాట్లాడి భరోసా నింపిన కేసీఆర్….

సెంట్రల్ జైల్లో ఖైదీలతో మాట్లాడి భరోసా నింపిన కేసీఆర్…
-ఎంజీఎం ఆసుపత్రి, వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన కేసీఆర్
-ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించిన సీఎం
-కలెక్టరేట్ నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్


ఈరోజు వరంగల్ లో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి కరోనా రోగులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలుకి వెళ్లి… అక్కడి ఖైదీలతో మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారిలో భరోసా నింపారు. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను వీక్షించారు.

వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కరోనా చికిత్సకు అవసరమైన అన్నీ సమకూర్చుకోవాలని సూచించారు. మరణాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని చెప్పారు.

వరంగల్ పర్యటనలో భాగంగా ఎంజీఎం దవాఖానను ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సందర్శించారు. నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ శ్రీ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. ప్రతీ బెడ్ దగ్గరకూ వెళ్లి కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు.

ఎంజీఎం ఆసుపత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

Related posts

తమిళనాడులో ఏనుగులకు సైతం కరోనా పరీక్షలు…

Drukpadam

మాస్క్ లు లేకుండా తిరుతుతున్న మహిళలు …మాస్క్ లు ఇచ్చిన మంత్రి …

Drukpadam

మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ విజృంభణ… ఉచితంగా చికిత్స ప్రభుత్వ నిర్ణయం

Drukpadam

Leave a Comment