Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అంద‌రి దృష్టి జ‌గ‌న్ నిర్ణ‌యంపైన్నే…

నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందుపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సీరియ‌స్‌గా దృష్టి సారించారు. ఈ మందు శాస్త్రీయ‌త‌పై నిగ్గుతేల్చి మందు పంపిణీపై కీల‌క నిర్ణ‌యం తీసుకునేందుకు అడుగులు వేస్తున్న‌ట్టు స‌మాచారం. 

ఇదే విష‌య‌మై వైద్య నిపుణులు, అధికారుల‌తో జ‌గ‌న్ స‌మీక్షించ‌నున్నారు. ఒక వైపు మందు చాలా బాగా ప‌నిచేస్తోంద‌నే విస్తృత ప్ర‌చారం నేప‌థ్యంలో , దాని శాస్త్రీయ‌త‌, ప‌నిచేసే విధానం త‌దిత‌ర అంశాల‌పై జ‌గ‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకునేందుకు నిర్ణ‌యించుకున్నారు.

ఈ మందుకు సంబంధించి ఇప్ప‌టికే జిల్లా అధికారులు ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించారు. దీని వ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వ‌ని తేలిన‌ట్టు అధికారులు నివేదిక స‌మ‌ర్పించారు. 

మ‌రింత లోతుగా చ‌ర్చించి , మందు పంపిణీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మందు పంపిణీ ప్ర‌క్రియ‌ను శుక్ర‌వారం స్థానిక స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ప్రారంభించారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందు క‌రోనాను అరిక‌డుతోంద‌నే న‌మ్మ‌కం, విశ్వాసాల‌ను ప్ర‌జ‌లు వ్య‌క్త‌ప‌రుస్తుండ‌డంతో అభ్యంత‌రం చెప్పాల్సిన అవ‌స‌రం ఏంట‌నేది ఆయ‌న వాద‌న‌. 

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కృష్ణ‌ప‌ట్నం ఆయుర్వేదం మందుకు సంబంధించి ముఖ్య‌మంత్రి నిర్ణ‌య‌మే ఫైనల్‌. దీంతో క‌రోనా బాధితుల దృష్టంతా జ‌గ‌న్ నిర్ణ‌యంపైన్నే ఉంది. సీఎం సానుకూలంగా స్పందిస్తే , ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోనే ప‌క‌డ్బందీగా మందు పంపిణీకి శ్రీ‌కారం చుట్టే అవ‌కాశాలున్నాయి.

Related posts

ఏపీలో ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాలు.. వాటి రాజధానులు ఇవే..!

Drukpadam

మాస్టర్ ప్లాన్ వేసి టమాటా లారీని ఎత్తుకెళ్లారు… దొరికిపోయారు!

Ram Narayana

ప్రపంచంలోని రెండో పెద్ద దేశం కెనడాలో.. ‘భూమి నో స్టాక్’!

Drukpadam

Leave a Comment