Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విశాఖ హెచ్ పీసీఎల్ లో భారీ అగ్నిప్రమాదం….

విశాఖ హెచ్ పీసీఎల్ లో భారీ అగ్నిప్రమాదం
  • పెద్దశబ్దంతో ఉలిక్కిపడిన స్థానికులు
  • మంటలతో దట్టమైన పొగలు
  • హెచ్ పీసీఎల్ పాత టెర్మినల్ లో ప్రమాదం
  • మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్) రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హెచ్ పీసీఎల్ పాత టెర్మినల్ లోని సీడీయూ (క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్) 3వ యూనిట్ లో పెద్ద మంటలతో దట్టమైన పొగలు అలముకున్నాయి. మొదట భారీ శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో, ఏం జరిగిందో తెలియక హడలిపోయారు. హెచ్ పీసీఎల్ వద్ద భారీగా మంటలు, పొగను గుర్తించారు.

కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అత్యాధునిక పరికరాలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో హెచ్ పీసీఎల్ వర్గాలు మూడు సార్లు సైరన్ మోగించి కార్మికులను, ఇతర ఉద్యోగులను బయటికి పంపించివేశాయి. ఘటన జరిగిన ప్రదేశంలో ఆరుగురు ఉద్యోగులు, మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్టు భావిస్తున్నారు.

విశాఖ హెచ్ పీసీఎల్ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు: కలెక్టర్ వినయ్ చంద

  • సవ్యంగా పనిచేసిన ఫైర్ సెన్సర్లు
  • అరగంటలో మంటలు అదుపులోకి వచ్చాయన్న కలెక్టర్
  • ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడి
  • ఘటన స్థలికి చేరుకున్న మంత్రి అవంతి

విశాఖపట్నంలోని హెచ్ పీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్పందించారు. హెచ్ పీసీఎల్ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అరగంటలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారని కలెక్టర్ వినయ్ చంద్ వివరించారు.

హెచ్ పీసీఎల్ క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్లో జరిగిన ఈ ప్రమాదంలో ఉవ్వెత్తున మంటలు చెలరేగడం తెలిసిందే. సైరన్ మోగడంతో తాము బయటికి వచ్చేశామని కార్మికులు తెలిపారు. సహాయక చర్యల్లో హెచ్ పీసీఎల్, అగ్నిమాపక సిబ్బందితో పాటు నేవీ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ సెన్సర్లు సవ్యంగా పనిచేయడంతో పెనుముప్పు తప్పినట్టు భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Related posts

ముగిసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు…

Drukpadam

ప్రధానికి భద్రతా వైఫల్యంపై రాష్ట్రపతి ఆందోళన…

Drukpadam

సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ ను విచారించే ధర్మాసనం ఖరారు

Ram Narayana

Leave a Comment