Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

సంగారెడ్డిలో కూలిన చర్చి.. నలుగురు కూలీలు దుర్మరణం

  • నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం
  • శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు కూలీలు
  • సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్ లు

నిర్మాణంలో ఉన్న చర్చి భవనం కుప్పకూలిన ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసేందుకు వారంతా శ్రమిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా కోహీర్ లో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం నిర్మాణ పనులు జరుగుతుండగా చర్చి స్లాబ్ సడెన్ గా కుప్పకూలింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ నిర్మాణ కూలీలు నలుగురు చనిపోయారు. మరో నలుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

హైదరాబాద్ లో భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం.. ఇద్దరు కూలీల మృతి

Ram Narayana

మొత్తానికి కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి.. కండువా కప్పిన ఖర్గే

Ram Narayana

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా రిటైర్డ్‌ డీజీపీ మహేందర్‌ రెడ్డి…?

Ram Narayana

Leave a Comment