Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఠాగుర్ సినిమాను తలపిస్తున్న ఎల్ బి నగర్ ఆస్పత్రి …డబ్బులు కట్టించుకొని శవాన్ని చూడనివ్వలేదు…

ఎల్బీనగర్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఠాగుర్ సినిమాను తలపిస్తున్న ఎల్బినగర్ఆస్పత్రి …డబ్బులు కట్టించుకొని శవాన్ని చూడనివ్వలేదు… ఈ ప్రవేట్ హాస్పిటల్స్ కేవలం డబ్బులకు మాత్రమే విలువ ఇస్తున్నట్లుగా ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. డబ్బులు కట్టలేదన్న సాకుతో హాస్పిటల్‌లో ఒక రోగికి వైద్యం నిలిపివేశారు. దీంతో ఆ రోగి మృతి చెందారు. దీంతో ఆమె పిల్లలు చివరకు అనాథలయ్యారు.

రాధ అనే మహిళకు లంగ్ ఇన్ఫెక్షన్ ఉండడంతో ఆ హాస్పిటల్‌లో 18 రోజుల క్రితం చేరింది. ఆమె వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఇప్పటివరకు రూ.6 లక్షలు హాస్పిటల్ బిల్లు రూపంలో కట్టారు. కానీ ఆమె వైద్యంలో ఎటువంటి పురోగతి లేదు. బిల్లు కట్టినా కూడా ఇంకా చెల్లించలేదని హాస్పిటల్ యజమాన్యం 5 రోజుల క్రితమే రాధకు చికిత్స ఆపివేశారు. ఆమె గురించి వైద్యులు కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. నిన్న హాస్పిటల్ సిబ్బంది మరో రూ.80 వేలు కట్టాలని ఒత్తిడి తేవడంతో కుటుంబ సభ్యులు రూ.80 వేలు కూడా కట్టేశారు. కనీసం రాధను చూడడానికి కూడా కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వలేదు.

అయితే, ‌ఈ రోజు ఉదయం రాధ ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్‌తో మరణించిందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. పదిహేను రోజుల క్రితమే తండ్రిని కోల్పోయిన ఇద్దరు పిల్లలు ఇప్పుడు తల్లికూడా చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలంటూ కోరారు. ఇటువంటి హాస్పిటల్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.‌

Related posts

ఈసీ సంచలన నిర్ణయం… సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీ పార్టీలకు జాతీయ హోదా రద్దు

Drukpadam

కరోనా భయం …రేపటి నుంచి విద్యాసంస్థల మూసివేత!

Drukpadam

అమెరికాలో టిక్‌టాక్‌, వీచాట్‌ డౌన్‌లోడ్ల నిలిపివేత ఉత్తర్వుల ఉపసంహరణ!

Drukpadam

Leave a Comment