Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ ప్రధాని.. ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రతిపాదన…

రాహుల్ ప్రధాని.. ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రతిపాదన…
-ఎన్నిక వ్యూహకర్త కాంగ్రెస్ కు అదిరిపోయే ఆఫర్
-ప్రాతీయపార్టీలను ఏకం చేస్తానని ధీమా
-బీజేపీ ని ఓడించటమే లక్ష్యంగా పావులు
-రాజకీయాలను షేక్ చేసేలా ప్రతిపాదన

ప్రశాంత కిషోర్ ….ప్రశాంత కిషోర్ …. ఈపేరు ఇప్పుడు భారత రాజకీయాలలో తెలియని వారు ఉండరు. 2014 లో ప్రధానిమోడీ అధికారం లోకి వచ్చేలా వ్యూహాలు రచించి సక్సెస్ అయ్యారు. ఆతరువాత అంతకు ముందు అనేక రాష్ట్రాలకు ఎన్నికలకు వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆయన వ్యూహం పన్నటం జరిగితే అది సక్సెస్ కావాల్సిందే … ఇటీవల బెంగాల్ ఎన్నికల్లో మమతకు వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఒక పక్క బీజేపీ మేమె అధికారంలోకి వస్తామని ప్రధాని మోడీ తోసహా అందరు ధీమాగా చెప్పిన ,ఆయన మాత్రం బీజేపీకి 100 సీట్ల లోపే వస్తాయని , ఛాలంజ్ చేశారు. అంతకు మించి ఒక్క సీటు వస్తే తాను ఇక నుంచి ఎన్నికల వ్యూహాలు రచించానని ప్రకటించారు. ఆయన అన్నట్లుగానే బీజేపీకి 100 రాలేదు. పైగా మమతా బెనర్జీ భారీ ఆదిక్యతం తో గెలిచారు .ఇప్పుడు కొత్త ప్రతిపాదన పెట్టారు……. రాహుల్ ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తే తాను వ్యూహకర్తగా వ్యవహరిస్తానని సంచలన ప్రకటన చేశారు…….
బీజేపీని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఇప్పటికే ఢిల్లీలో కేజ్రీవాల్ ను.. ఏపీలో వైఎస్ జగన్ ను, తమిళనాడులో స్టాలిన్ ను.. తాజాగా బెంగాల్ లో మమతా బెనర్జీని గెలిపించి చరిత్ర సృష్టించాడు ప్రశాంత్ కిషోర్ (పీకే). పీకే స్కెచ్ గీస్తే ఆ రాష్ట్రంలో ఆ పార్టీ గెలవాల్సిందే..

ప్రధానంగా బీజేపీకి వ్యతిరేకంగానే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని బీజేపీని ఓడించే పార్టీలతోనే జట్టుకట్టి కమల దళానికి కొరకరాని కొయ్యగా మారిపోయాడు. ఇప్పుడు తన టార్గెట్ ను జాతీయ రాజకీయాలపై మరల్చాడు..

తాజాగా ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశాడు. 2024 లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి గా రాహుల్ గాంధీ నీ ప్రకటిస్తే రాహుల్ కోసం పనిచేయడానికి సిద్ధంమని ప్రశాంత్ కిషోర్ జాతీయ రాజకీయాలను షేక్ చేసే ప్రకటన చేశాడు. కేంద్రంలోని మోడీ సర్కార్ అసంబద్ద విధానాలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటి కావాలని.. కాంగ్రెస్ నేతృత్వంలో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చాడు..

రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తే ఆయన గెలుపు బాధ్యతను తాను భుజాన వేసుకుంటానని ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రతిపాదనను కాంగ్రెస్ కు ఇచ్చాడు. రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ కు మద్దతుగా నిలబెడుతానని ప్రకటించారు..

పీకే చేసిన ప్రకటన ఖచ్చితంగా జాతీయ రాజకీయాలను షేక్ చేసేలా ఉంది. ఇన్నాళ్లు కేంద్రంలో ఎదురులేకుండా ఉన్న బీజేపీకి ఈ ప్రకటన షాకింగ్ లా మారింది. నిజంగా కాంగ్రెస్ కనుక రాహుల్ ను ప్రధాని అభ్యర్తిగా ప్రకటిస్తే.. ప్రాంతీయ పార్టీలు మద్దతు కూడగడితే.. పీకే రంగంలోకి దిగితే దేశ రాజకీయాలు మారినా మారొచ్చని అంటున్నారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో….!!

Related posts

కాంగ్రెస్ లో గాంధీ కుటుంబానిదే పట్టు ..నిరూపించిన అధ్యక్ష ఎన్నిక!

Drukpadam

దళిత బందు అమలు కావాలంటే తమ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని పెరుతున్న డిమాండ్!

Drukpadam

ఆత్మగౌరవ నినాదం …తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు జై అన్న పొంగులేటి , జూపల్లి …

Drukpadam

Leave a Comment