Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్కోర్ట్ తీర్పులు

సీఎం జగన్ పై రాయి దాడి కేసు నిందితుడికి బెయిల్ మంజూరు…

  • ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి
  • సతీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు
  • విజయవాడ 8వ అదనపు జిల్లాకోర్టులో నిన్న బెయిల్ వాదనలు పూర్తి
  • నేడు తీర్పు వెలువరించిన న్యాయమూర్తి
  • షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్టు వెల్లడి

ఏపీ సీఎం జగన్ పై ఏప్రిల్ 13న విజయవాడలో రాయి దాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సతీశ్ కు విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిన్న వాదనలు పూర్తి కాగా, తీర్పును నేటికి రిజర్వ్ చేశారు. 

ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి నేడు తీర్పు వెలువరించారు. నిందితుడు సతీశ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. శని, ఆదివారాలు పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని సతీశ్ ను ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది.

సతీశ్ ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు అందిన తర్వాత అతను విడుదల కానున్నాడు.

Related posts

హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనకుంటే భారత్ ఇస్లాం దేశం అవుతుందట: యతి సత్యదేవానంద్ సరస్వతి!

Drukpadam

90 ఏళ్ల వయసు.. రూ.20 వేల కోట్ల సంపద.. రోజూ ఆఫీస్ కు వెళ్లాల్సిందే!

Drukpadam

కరోనాతో మాకు సంబంధం లేదు.. మా విధులు మేము నిర్వహించాం—సుప్రీంకోర్టుకు తెలిపిన ఈసీ

Drukpadam

Leave a Comment