ఆంధ్రప్రదేశ్కోర్ట్ తీర్పులు

సీఎం జగన్ పై రాయి దాడి కేసు నిందితుడికి బెయిల్ మంజూరు…

  • ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి
  • సతీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు
  • విజయవాడ 8వ అదనపు జిల్లాకోర్టులో నిన్న బెయిల్ వాదనలు పూర్తి
  • నేడు తీర్పు వెలువరించిన న్యాయమూర్తి
  • షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్టు వెల్లడి

ఏపీ సీఎం జగన్ పై ఏప్రిల్ 13న విజయవాడలో రాయి దాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సతీశ్ కు విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిన్న వాదనలు పూర్తి కాగా, తీర్పును నేటికి రిజర్వ్ చేశారు. 

ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి నేడు తీర్పు వెలువరించారు. నిందితుడు సతీశ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. శని, ఆదివారాలు పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని సతీశ్ ను ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది.

సతీశ్ ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు అందిన తర్వాత అతను విడుదల కానున్నాడు.

Related posts

పెళ్లి పేరుతో సొంత చెల్లిపై అత్యాచారం .. విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు…

Ram Narayana

మీరు పీఎం కిసాన్ ఈ-కేవైసీ చేయించారా…?లేకపోతె చేయించండి …

Drukpadam

సర్వమతసమ్మేళనానికి ప్రతీక ఖమ్మం..గణేష్ నిమజ్జనోత్సవాల్లో మంత్రి పువ్వాడ అజయ్…

Drukpadam