ఆంధ్రప్రదేశ్కోర్ట్ తీర్పులు

సీఎం జగన్ పై రాయి దాడి కేసు నిందితుడికి బెయిల్ మంజూరు…

  • ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి
  • సతీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు
  • విజయవాడ 8వ అదనపు జిల్లాకోర్టులో నిన్న బెయిల్ వాదనలు పూర్తి
  • నేడు తీర్పు వెలువరించిన న్యాయమూర్తి
  • షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్టు వెల్లడి

ఏపీ సీఎం జగన్ పై ఏప్రిల్ 13న విజయవాడలో రాయి దాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సతీశ్ కు విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిన్న వాదనలు పూర్తి కాగా, తీర్పును నేటికి రిజర్వ్ చేశారు. 

ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి నేడు తీర్పు వెలువరించారు. నిందితుడు సతీశ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. శని, ఆదివారాలు పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని సతీశ్ ను ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది.

సతీశ్ ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు అందిన తర్వాత అతను విడుదల కానున్నాడు.

Related posts

సొంత ఖర్చులతోనే లోకేశ్ విమాన ప్రయాణాలు: ఆరోపణలను ఖండించిన టీడీపీ

Ram Narayana

ఏపీ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఎం.విజయరాజు సస్పెన్షన్

Ram Narayana

అభ్యంతరకర పోస్టు పెట్టి సారీ చెప్పేస్తే సరిపోదు.. పర్యవసానం ఎదుర్కోవాల్సిందే!: సుప్రీంకోర్టు

Ram Narayana