Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

భానుడి ప్రతాపానికి అగ్నిగుండంగా మారిన దేశరాజధాని ఢిల్లీ

భానుడి వేడికి దేశంలోని ఉత్తర భారతం భగభగ మండుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ఎండ వేడికి ఉడుకుతోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం..

భారత రాజధానిలో ఉష్ణోగ్రతలు బుధవారం రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగాయి. ఈ విపరీతమైన వేడి ఢిల్లీ శివారు ముంగేష్‌పూర్‌లో నమోదైంది. ఇది నగర చరిత్రలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల్ సెల్సియస్‌ను అధిగమించడం ఇదే మొదటిసారి. ముంగేష్‌పూర్‌లోని వాతావరణ కేంద్రంలో మధ్యాహ్నం 2.30 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్, నరేలాలో 47.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో కూడా పంజాబ్, హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లలోని కొన్ని ప్రదేశాలలో హీట్ వేవ్ నుంచి తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులను ఐఎండీ అంచనా వేసింది.

Related posts

పాక్ మహిళ హనీట్రాప్‌లో చిక్కిన వైజాగ్ స్టీల్‌ప్లాంట్ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్

Ram Narayana

అమితాబ్ బచ్చన్‌కు 82 ఏళ్లు.. ఇప్పటికీ నటిస్తున్నారుగా!: అజిత్‌కు సుప్రియా సూలే కౌంటర్…

Drukpadam

ఫిబ్రవరి 16న భారత్ బంద్.. పిలుపునిచ్చిన రైతు బీకేయూ

Ram Narayana

Leave a Comment