Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మరి వీరిని ఎలాంటి దొంగలు అనాలి ….

మరి వీరిని ఎలాంటి దొంగలు అనాలి ….
పన్నులు ఎగ్గొట్టిన వారెన్​ బఫెట్​, జెఫ్​ బెజోస్​, ఎలాన్​ మస్క్​!
0.1 శాతమే పన్ను కట్టిన వారెన్ బఫెట్
ప్రోపబ్లికా అనే వార్తా సంస్థ సంచలన కథనం
ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ రికార్డులు బయటకు
రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయడంపై ఐఆర్ఎస్ మండిపాటు
డేటా లీక్ చేసిన వారికి జైలు శిక్ష తప్పదని హెచ్చరిక

పొట్టకూటి కోసం దొంగ తనం చేసిన వారిని అత్యంత దుర్మార్గంగా చూస్తాం పెద్ద నేరస్తుడిగా పరిగణించి పెద్ద పెద్ద శిక్షలు వేస్తాం … వారిని థర్డ్ డిగ్రీ ఉపయోగించి విపరీతంగా హింసకు గురిచేస్తాం …. కొన్ని సందర్భాలలో లాక్ డెత్ లు జరుగుతాయి … ప్రపంచంలో పేరుపోసిన పెద్ద మనుషులు … వారికీ ఎక్కడైనా రాచమర్యాదలే….. దేశాల ప్రధానులు , రాష్ట్రపతులు , అధ్యక్షలు వారికీ ఎదురేగి స్వాగతం పలకలిసిందే … వారితో కలిసి విందులు ఆరగించాల్సిందే ….. కాని వారు చేస్తున్న దోపిడీ గురించి తెలిసినా, తెలియనట్టు ఉంటారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన వీరు ట్రిలియన్ కోట్ల సంపద కలిగి ఉన్నారు. పన్నులు ఎగొట్టటంలో ఘనాపాటీలు….. పన్నులు ఎగ్గొట్టిన వారెన్​ బఫెట్​, జెఫ్​ బెజోస్​, ఎలాన్​ మస్క్​! గురించి తెలుసు కోవాల్సిందే ….
వాళ్లంతా మామూలు ధనవంతులు కాదు.. ప్రపంచ కుబేరులు. సెకను సెకనుకు సంపదను పెంచుకుంటూనే ఉన్నారు. అలాంటి కుబేరులే అమెరికాకు భారీగా పన్నులు ఎగవేశారు. అవును, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్) రికార్డుల ప్రకారం.. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, బ్లూమ్ బర్గ్ వ్యవస్థాపకుడు మైకేల్ బ్లూమ్ బర్గ్, ఇన్వెస్టర్లు కార్ల్ ఇచాన్, జార్జ్ సోరోస్, వారెన్ బఫెట్ వంటి వాళ్లు కొన్ని కోట్లు ఎగ్గొట్టారని ప్రో పబ్లికా అనే వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

2007, 2011లలో బెజోస్, 2018లో మస్క్ లు పన్ను ఎగ్గొట్టారని పేర్కొంది. ఇటు వారెన్ బఫెట్ కూడా 2014 నుంచి 2018 మధ్య 2,430 కోట్ల డాలర్ల సంపదను మూటగట్టుకున్నా.. కేవలం 2.37 కోట్ల డాలర్ల పన్నులే కట్టారని ఆరోపించింది. ఆయన సంపాదించిన దాంట్లో కట్టిన పన్ను కేవలం 0.1 శాతమేనని తెలిపింది.

దీనిపై ఐఆర్ఎస్ కమిషనర్ చార్లెస్ రెట్టింగ్ స్పందించారు. సెనేట్ ఫైనాన్స్ కమిటీ విచారణకు ఆయన హాజరయ్యారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని చెప్పారు. ఆరోపణలపై నిజానిజాలను నిగ్గుతేలుస్తామన్నారు. అంతేగాకుండా రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బయటకు లీక్ చేసే విషయంపైనా దర్యాప్తు చేస్తామన్నారు. రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని లీక్ చేసిన వారు జైలు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.

మహమ్మారి సమయంలో సంపదను అపారంగా పెంచుకున్న వ్యక్తులు.. పన్నులు మాత్రం కట్టడం లేదని సెనేట్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ రాన్ వైడెన్ అన్నారు. పన్ను కట్టే వారి సమాచారన్ని భద్రంగా ఉంచడం ఐఆర్ఎస్ విధి అని, అనధికారికంగా ఆ వివరాలు బయటపడడం చాలా పెద్ద నేరమని అన్నారు. ఆ వివరాలను వెల్లడించిన వారిపై దర్యాప్తు చేయించాలన్నారు.

Related posts

ఆటోలోంచి కిందపడిన రూ. 500 నోట్లు.. పట్టనట్టు వెళ్లిపోయిన వైనం!

Drukpadam

ఉత్తరప్రదేశ్‌లో పాఠశాల నిర్వాహకుడి అకృత్యం.. ఆహారంలో మత్తుమందు కలిపి 17 మంది విద్యార్థినులపై అత్యాచారం!

Drukpadam

ఇంట్లో అక్రమ టెలిఫోన్ ఎక్చేంజి నడుపుతున్న తోబుట్టువులు.. దేశ విద్రోహ సందేశాల వ్యాప్తి!

Drukpadam

Leave a Comment