Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుమల కొండపై భక్తులకు శుభవార్త -గదుల కేటాయింపుకు రిజిస్ట్రేషన్…

తిరుమల కొండపై భక్తులకు శుభవార్త -గదుల కేటాయింపుకు రిజిస్ట్రేషన్
– గదుల కేటాయింపులను మరింత సులభతరం చేసిన టీటీడీ
-6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాల ఏర్పాటు
-పేర్లు నమోదు చేసుకుంటే ఫోన్లకు సందేశం
-ఎస్ఎంఎస్ వస్తే నగదు చెల్లించి రూం పొందేలా ఏర్పాట్లు
-ఎల్లుండి రిజిస్ట్రేషన్ కేంద్రాల ప్రారంభం
తిరుమల కొండపై భక్తులకు శుభవార్త -గదుల కేటాయింపుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది . ముందుగా కేటాయించిన చోటు నుంచి పేరు నమోదు చేసుకొని వెళ్ళితే చాలు వెంటనే వారు ఫోన్ నెంబర్ కు మెస్సేజ్ వస్తుంది. దాని ఆధారంగా వారు డబ్బు చెల్లిస్తే సరిపోతుంది . ఇందుకు ఆరు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు .
తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపు మరింత సులభతరం చేసేందుకు టీటీడీ సరికొత్త ప్రణాళిక అమలు చేస్తోంది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీఎన్ సీ, బాలాజీ బస్టాండ్, కౌస్తుభం, సీఆర్ఓ, రామ్ భగీచ, ఎంబీసీ వద్ద రిజిస్ట్రేషన్ కేంద్రాలను నెలకొల్పారు.

ఈ కేంద్రాల వద్ద తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ ద్వారా గదుల సమాచారం అందించనున్నారు. ఎస్ఎంఎస్ వచ్చిన వెంటనే నగదు చెల్లించి గది పొందేలా ఏర్పాట్లు చేశారు. టీటీడీ ఈ నెల 12న ఉదయం 8 గంటలకు ఈ రిజిస్ట్రేషన్ కేంద్రాలను ప్రారంభించనుంది.

Related posts

తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పై నిషేధం విధించిన రష్యా!

Drukpadam

కెనడాలో ప్రాణాంతక ‘జాంబీ’ వ్యాధి.. వ్యాక్సిన్లు, చికత్సల్లేవ్!

Drukpadam

భద్రాచలంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ..ఘనస్వాగతం పలికి మంత్రులు పువ్వాడ ,సత్యవతి రాథోడ్ …

Drukpadam

Leave a Comment