Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మహిళ వేషంలో వచ్చి మర్డర్ రాజస్థాన్ లో ఘోరం ….

మహిళ వేషంలో వచ్చి మర్డర్ రాజస్థాన్ లో ఘోరం ….
-అత్యాచార బాధితురాలినే హత్య చేసిన నిందితుడు!
-గతేడాది పొరుగింటి మహిళపై అత్యాచారం
-నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
-బెయిల్ పై బయటికొచ్చిన వ్యక్తి దారుణానికి పాల్పడిన వైనం
-కేసు వెనక్కి తీసుకోనందుకు ఘాతుకం

రాజస్థాన్ లో దారుణం జరిగింది. అత్యాచారానికి గురైన బాధితురాలిని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి హత్య చేశాడు. అది కూడా ఓ మహిళ వేషంలో వచ్చి ఆమె ప్రాణాలు తీశాడు. కేసును వెనక్కి తీసుకోనందుకు ఆమెపై కక్ష పూనిన నేత్రమ్ అనే వ్యక్తి ఇద్దరు పిల్లల తల్లయిన ఆమెను అంతమొందించాడు.

సిరోహి జిల్లాకు చెందిన నేత్రమ్, బాధిత మహిళ ఇరుగుపొరుగు వారే. అయితే నేత్రమ్ గతేడాది ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నేత్రమ్ ను అరెస్ట్ చేశారు. కొంతకాలం కిందటే అతడు బెయిల్ పై బయటికి వచ్చాడు. అప్పటి నుంచి కేసు ఉపసంహరించుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

బాధితురాలు ఓ వితంతువు. ఇద్దరు పిల్లలు, చెల్లెలుతో కలిసి నివసిస్తోంది. గత రాత్రి ఎవరూ తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు ఓ మహిళ వేషంలో బాధితురాలి ఇంటికి వెళ్లిన నేత్రమ్… నిద్రిస్తున్న ఆమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె చెల్లెలిపైనా దాడి చేశాడు. అనంతరం అక్కడ్నించి పరారయ్యాడు. కత్తిపోట్లకు గురైన బాధితురాలు మరణించింది. పోలీసులు నేత్రమ్ కోసం తీవ్రంగా గాలించి, సోమవారం ఉదయం అతడిని అరెస్ట్ చేశారు.

Related posts

రూ. 6 లక్షల విలువైన బ్లూటూత్ చెప్పులు ధరించి హైటెక్ కాపీయింగ్‌కు యత్నం.. ఐదుగురికి అరదండాలు!

Drukpadam

భార్య పేరుపై రూ. 1.90 కోట్ల బీమా.. కారుతో తొక్కి చంపించిన భర్త!

Drukpadam

ఢిల్లీ పోలీసుల ముందు లొంగిపోయిన ‘పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన సూత్రధారి’

Ram Narayana

Leave a Comment