Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

రూ.21 కోట్లు విలువ చేసే బంగారం పట్టివేత..

రూ.21 కోట్లు విలువ చేసే బంగారం పట్టివేత..
-దాన్ని కారునుంచి వెలికితీయడానికి 18 గంటలు
-పోలీసులకు ముందస్తు సమాచారం
-ఇంఫాల్‌లో ముమ్మర తనిఖీలు
-కారులోని ప్రత్యేక అరల్లో బంగారం
-వెలికితీయడానికి 18 గంటలు

మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే 43 కిలోల బంగారం బయటపడింది. అధికారిక వివరాల ప్రకారం.. బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు ముందే సమాచారం అందింది. దీంతో తనిఖీలను ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. బంగారం అక్రమ రవాణా బయటపడింది. కారులో ఏర్పాటు చేసిన ప్రత్యేక అరల్లో మొత్తం 260 బంగారం బిస్కెట్లను గుర్తించారు. వాటిని కారు నుంచి వెలికి తీసేందుకు 18 గంటల సమయం పట్టడం గమనార్హం. ఇదే వాహనాన్ని గతంలో స్మగ్లింగ్‌కి కూడా వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కారు ఎన్నిసార్లు బంగారాన్ని స్మగుల్ చేసేందుకు వినియోగించారు. ఎంత బంగారాన్ని స్మగుల్ చేశారు అనేదానిపై ఆరా తీస్తున్నారు .

మయన్మార్‌ సరిహద్దుల్లో ఉన్న మణిపూర్‌లో బంగారం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత మూడు నెలల్లో 67 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. దీంట్లో 55 కిలోల బంగారం ఒక్క జూన్‌ నెలలోనే పట్టుబడడం గమనార్హం.

Related posts

పిల్లి గీరిందనుకున్న వ్యక్తి.. తీరా చూస్తే తుపాకీ తూటా దిగిందని వెల్లడి -రాజస్థాన్‌లో లైన్‌మన్‌గా పనిచేస్తున్న నేమి చంద్!

Drukpadam

పూంచ్ దాడి మా పనే: ప్రకటించిన జైషే మహ్మద్!

Drukpadam

రోజుకు రూ. 5 కోట్లు దోచుకుంటున్న సైబర్ నేరగాడి అరెస్ట్..

Drukpadam

Leave a Comment