Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నారా లోకేశ్ పై ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫైర్…

నారా లోకేశ్ పై ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫైర్
లోకేశ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి
లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడు
తిట్టాలనుకుంటే మేము కూడా తిట్టగలం

పాణ్యం నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యల వెనుక పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ తో పాటు పలువురు నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేశ్ పై కాటసాని మండిపడ్డారు. లోకేశ్ నోరు అదుపులో పెట్టుకోవాలని… లేకపోతే ఆయన కథ చూస్తామని హెచ్చరించారు. రెచ్చగొట్టేలా లోకేశ్ మాట్లాడుతున్నారని అన్నారు. హత్యలను తమకు ఆపాదించటం ఏమిటని ప్రశ్నించారు. విషయాలు తెలియకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు.

వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేశ్… ఒక జోకర్ వంటి వాడని కాటసాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. తిట్టాలనుకుంటే తాము కూడా తిట్టగలమని… కాకపోతే ఆ సంస్కృతి తమకు లేదని చెప్పారు. లోకేశ్ ట్విట్టర్లో తప్ప ప్రజల ముందుకు వచ్చి మాట్లాడలేడని అన్నారు.

హత్యా రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదని కాటసాని అన్నారు. లోకేశ్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని… వైయస్సార్ కొడుకుగా జగన్ ఎలా మాట్లాడుతున్నారో చూసి లోకేశ్ నేర్చుకోవాలని హితవు పలికారు. పులికి పులి బిడ్డ పుట్టిందని… నక్కకు నక్క బిడ్డ పుట్టిందని ఎద్దేవా చేశారు. రాజకీయాలను కలుషితం చేసింది చంద్రబాబు కదా ? కొడుకు కూడా అదే దారిలో పయనిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని అన్నారు.
తెలుగుదేశం పని అయిపోయిందని ప్రజలు అనుకుంటున్న తరుణంలో మేము కూడా ఉన్నాం అనేందుకు చంద్రబాబు , లోకేష్ లు పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. తమ పార్టీ కోసం ఏమైనా పాటు పడండి ఎదుటివారి మీద నిందలు వేయడం తగదని హితవు పలికారు .

Related posts

రాహుల్‌పై ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌శ్నల వ‌ర్షం!

Drukpadam

రేపే ఢిల్లీలో దీదీ నేతృత్వంలో కీలక సమావేశం… సీపీఎం దూరం..

Drukpadam

బీజేపీ ,ఆర్ ఎస్ ఎస్ విధానాలు దేశానికి నష్టం …విపక్ష నేతలు

Drukpadam

Leave a Comment