Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పరీక్షల విషయంలో.. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు!

పరీక్షల విషయంలో.. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ఆగ్రహం
రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరిక

ఏపీ ప్రభుత్వ తీరుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణపై ఇన్ని రోజులైనా అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వ తరపు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది. రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో, ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని… ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీని ఎందుకు మినహాయించాలని వ్యాఖ్యానించింది. 12వ తరగతి పరీక్షలను నిర్వహిస్తారా? లేదా? చెప్పాలని ఆదేశించింది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి… సెప్టెంబరులో 11వ తరగతి పరీక్షలను నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం తెలిపింది.

సుప్రీంకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం గౌరవించి తక్షణమే పరీక్షలు రద్దు చేయాలి: నారా లోకేశ్
మొండి పట్టుదల ఎందుకన్న లోకేశ్
వ్యవస్థలను గౌరవించాలని హితవు

ఈ నేపథ్యంలో, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. మొండిగా పరీక్షలు నిర్వహిస్తామంటున్న ఏపీ ప్రభుత్వం తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసిందని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఏపీలో తక్షణమే పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

దేశమంతా రద్దు చేస్తే, ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహించి తీరుతామని ఎందుకు పట్టుబడుతున్నారో అర్థం కావడంలేదని విమర్శించారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలంటూ రెండు నెలలుగా పోరాడుతున్నా, మూర్ఖపు ఆలోచనలతో లక్షలాది విద్యార్థులను కొవిడ్ కోరల్లోకి నెట్టేందుకు జగన్ వెనుకాడడం లేదని మండిపడ్డారు.

సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా అఫిడవిట్ వేయని సర్కారు… ఇప్పుడు ఒక్క విద్యార్థికి కొవిడ్ సోకినా బాధ్యత వహించగలదా? పోయిన ప్రాణాలను జగన్ తిరిగి తీసుకురాగలరా? అని లోకేశ్ ప్రశ్నించారు. ఇప్పటికైనా వ్యవస్థల ఆదేశాలను గౌరవించి తక్షణమే పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Related posts

సరుకులు మోసుకుంటూ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన చైనా వ్యోమనౌక!

Drukpadam

పాకిస్థాన్ మత్స్యకారుల వలలో అరుదైన చేప ‘క్రోకర్ ఫిష్’ ధర రూ.8.64 లక్షలు…

Drukpadam

పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్

Drukpadam

Leave a Comment