Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ సీరియస్..జైలుకు పంపుతామని సీఎస్ కు హెచ్చరిక!

ఏపీ ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రిబ్యునల్  సీరియస్..జైలుకు పంపుతామని సీఎస్ కు హెచ్చరిక!
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై విచార‌ణ‌
పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్ల‌కూడ‌ద‌ని గతంలో ఆదేశాలు
ఆదేశాలను ఉల్లంఘిస్తూ పనులు చేపడుతున్నారని పిటిష‌న్‌
తదుపరి విచారణ వ‌చ్చేనెల‌ 12కి వాయిదా

కృష్ణనదిపై ప్రాజక్టుల విషయంలో ఎపి ప్రభుత్వానికి వార్నింగ్ ల మీద వార్నింగ్ లు …. పర్యావణ అనుమతులు లేకుండానే రాయలసీమ ఈటిపోతల పథకం ప్రాజక్టు నిర్మాణం జరగడం పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరోసారి ఎపి హెచ్చరిక …. ఈసారి ఉత్తీతి వార్నింగ్ కాదు ఏకంగా తమ తీర్పుకు విరుద్ధముగా ప్రాజక్టు పనులు నిలిపి వేయకపోతే జైలుకు వెళ్లక తప్పదని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.

ఇప్పటికే కృష్ణనది నీటి నిర్వహణ యజమాన్యబోర్డు ప్రాజక్టులపై కీలక ఆదేశాలు జారీచేసింది. ఇంతకూ ముందే గ్రీన్ ట్రిబ్యునల్ కృష్ణనది నీటి నిర్వహణ యజమాన్యబోర్డు ను ప్రాజక్టు ల పనులపై పరిశీలనా చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది . అయితే ఎపి ప్రభుత్వం ప్రాజెక్టు చేసేందుకు అనుమతి ఇవ్వడంలేదని ట్రిబ్యునల్ కు తెలియజేసింది. ఈ నేపథ్యంలో గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరికలు సంచలనంగా మారాయి…….

 

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై ధ‌ర్మాస‌నం ఈ రోజు మ‌రోసారి విచార‌ణ జ‌రిపింది. ఏపీ చేప‌ట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్ల‌కూడ‌ద‌ని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ పనులు చేపడుతున్నారని తెలంగాణ సామాజిక కార్య‌క‌ర్త‌ గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేయ‌డంతో దీనిపై విచార‌ణ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఏపీ ప్రభుత్వంపై ట్రైబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామని ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని హెచ్చరించింది. ఎత్తిపోతల పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ పిటిష‌న్‌పై తదుపరి విచారణను వ‌చ్చేనెల‌ 12కి వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపింది.

Related posts

ఇదెక్కడి న్యాయం జగనన్నా.. సింహాచలం దేవస్థానం మాజీ సభ్యురాలు దేవి ఆవేదన

Drukpadam

నెరవేరిన 28 ఏళ్ల అర్జెంటీనా కల.. దేశానికి కోపా కప్‌ను అందించిన మెస్సీ!

Drukpadam

హైద‌రాబాద్ అమ్మాయికి రూ.2 కోట్ల వార్షిక వేత‌నంతో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం…

Drukpadam

Leave a Comment