Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కుర్చీలతో కొట్టుకున్న న్యాయవాదులు!

ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత… కుర్చీలతో కొట్టుకున్న న్యాయవాదులు!
  • బార్ కౌన్సిల్ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశం
  • న్యాయవాదుల మధ్య భేదాభిప్రాయాలు
  • పరస్పరం ఘర్షణ
  • బార్ కౌన్సిల్ సభ్యుడు అజయ్ కుమార్ కు గాయం
  • సీజేని కలిసేందుకు న్యాయవాదుల యత్నం
Brawl at high court bar association general body meeting

ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం రసాభాస అయింది. బార్ కౌన్సిల్ ఎన్నికలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. అయితే, న్యాయవాదుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. పలువురు న్యాయవాదులు చేతికందిన కుర్చీలతో యుద్ధానికి దిగారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది.

ఈ ఘటనలో బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్ కుమార్ గాయపడ్డారు. ఆయన తలకు దెబ్బ తగిలింది. ఈ ఘర్షణల నేపథ్యంలో అజయ్ కుమార్, ఇతర న్యాయవాదులు హైకోర్టు సీజేని కలిసేందుకు యత్నించారు. కాగా, ఈ సమావేశంలో న్యాయవాదులు రాయలసీమ, కోస్తా వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగినట్టు తెలుస్తోంది. పోలీసుల జోక్యంతో న్యాయవాదులు శాంతించారు.

Related posts

ఎర్రకోట వేదికగా ప్రధాని పేదలకు వరాలు …స్థానిక భాషల్లో తీర్పులపై సుప్రీం కు కితాబు …

Ram Narayana

గ్రీన్ కార్డ్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన బైడెన్ సర్కార్…

Drukpadam

మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో ఏజన్సీలో డిజిపి మహేందర్ రెడ్డి పర్యటన…

Drukpadam

Leave a Comment