ఆంధ్రప్రదేశ్

విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రికి సీబీఐ నోటీసులు…

 

 

 

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం

విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రికి సీబీఐ నోటీసులు

ఆదివారం సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

తమపై కేంద్రం ఒత్తిడి పెంచుతోందంటూ ఆప్ ఆరోపణ

 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆదివారం ఆయనను సీబీఐ కార్యాలయంలో అధికారులు విచారించనున్నారు.

ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సహా పలువురు నేతలు విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. తమ పార్టీకి జాతీయ హోదా వచ్చాక కేంద్ర ప్రభుత్వం తమపై ఒత్తిడి పెంచుతోందని ఆప్ ఆరోపిస్తోంది. ఇక సీబీఐ నోటీసులపై ఆప్ మరికాసేపట్లో పత్రికా సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం.

Related posts

అత్యంత ఘనంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం…

Drukpadam

మునుగోడులో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే…!

Drukpadam

కోడిగుడ్డు శాఖాహార‌మే.. తేల్చి చెప్పిన శాస్త్ర‌వేత్త‌లు…

Drukpadam