ఆంధ్రప్రదేశ్

తిరుమల నడకమార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం

  • ఇటీవల ఓ బాలికపై దాడిచేసి చంపేసిన చిరుత
  • ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు
  • శని, ఆదివారాల్లో సంచరిస్తూ కెమెరాలకు చిక్కిన రెండు చిరుతలు, ఎలుగుబంట్లు

తిరుమల నడకమార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం ఎక్కువైంది. అలిపిరి మార్గంలో ఇటీవల ఓ బాలికపై చిరుత దాడిచేసి చంపేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్ సీసీ కెమెరాల్లో వీటి సంచారం రికార్డయింది.   

నడకమార్గంలోని ఏడో మైలురాయి వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో శుక్ర, శనివారాల్లో అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి, రెండు చిరుతలు సంచరిస్తూ కనిపించాయి. నిన్న సాయంత్రం నరసింహస్వామి ఆలయ సమీపంలోనూ ఎలుగుబంటి సంచరించింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు నడకదారి భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టారు.

Related posts

గచ్చిబౌలిలో పిడుగు… హడలిపోయిన ప్రజలు…

Ram Narayana

దుగ్గిరాలలో ఓటుకోసం దరఖాస్తు చేసుకున్న మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందని జీతాలు …ఉద్యోగుల గగ్గోలు…

Drukpadam