Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుమల నడకమార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం

  • ఇటీవల ఓ బాలికపై దాడిచేసి చంపేసిన చిరుత
  • ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు
  • శని, ఆదివారాల్లో సంచరిస్తూ కెమెరాలకు చిక్కిన రెండు చిరుతలు, ఎలుగుబంట్లు

తిరుమల నడకమార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం ఎక్కువైంది. అలిపిరి మార్గంలో ఇటీవల ఓ బాలికపై చిరుత దాడిచేసి చంపేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్ సీసీ కెమెరాల్లో వీటి సంచారం రికార్డయింది.   

నడకమార్గంలోని ఏడో మైలురాయి వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో శుక్ర, శనివారాల్లో అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి, రెండు చిరుతలు సంచరిస్తూ కనిపించాయి. నిన్న సాయంత్రం నరసింహస్వామి ఆలయ సమీపంలోనూ ఎలుగుబంటి సంచరించింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు నడకదారి భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టారు.

Related posts

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా సౌదీ ఆరాంకో!

Drukpadam

భారత రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ..

Drukpadam

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారికి ఏపీ సీఐడీ చీఫ్ హెచ్చరిక

Ram Narayana

Leave a Comment