Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు కొత్త ఎస్పీలు వీరే!

  • ఏపీలో పోలింగ్ రోజున, ఆ తర్వాత అల్లర్లు
  • పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
  • తిరుపతి ఎస్పీ బదిలీ
  • పల్నాడు ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమ్ సాలి నియామకం
  • తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ నియామకం

ఎన్నికల హింస నేపథ్యంలో పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఎన్నికల సంఘం, తిరుపతి ఎస్పీని బదిలీ చేయడం తెలిసిందే. తాజాగా… ఈసీ ఈ మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది.

పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి సాలి, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పంపించిన అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Related posts

మరో ఏడాది వరకు హెచ్1బీ, ఇతర వర్క్ వీసాలకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలను రద్దు చేసిన అమెరికా విదేశాంగ శాఖ  !

Drukpadam

ముఖేశ్ అంబానీ, ఆయ‌న ఫ్యామిలీకి భ‌ద్ర‌త కొన‌సాగించాల్సిందే: సుప్రీంకోర్టు!

Drukpadam

జియో ఫైబర్ ఆకర్షణీయ ప్లాన్లు.. ఇన్ స్టలేషన్ ఉచితం…

Drukpadam

Leave a Comment