ఆఫ్ బీట్ వార్తలు

పూరీ ఆలయంలో వింత ఘటన.. భక్తుల విస్మయం!

  • జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గద్ద.. వీడియో ఇదిగో!
  • సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టిన భక్తులు
  • ఆలయ దర్శనంలో తొలుత జెండాకు భక్తుల మొక్కులు

పూరీ జగన్నాథ ఆలయంలో ఆదివారం ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. ఆలయ శిఖరంపై ఎగురవేసే జగన్నాథుడి పవిత్ర జెండాను ఓ గద్ద ఎత్తుకెళ్లింది. జెండాను తన నోట కరిచి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఇది చూసిన భక్తులు ఆశ్చర్యంతోపాటు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది భక్తులు ఈ ఘటనను తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

జగన్నాథుడి దర్శనం కోసం పూరీ వచ్చే భక్తులు తొలుత ఈ పతితపావన జెండాకు నమస్కరించుకుంటారు. ఆపై ఆలయంలోకి వెళ్లి జగన్నాథుడి దర్శనం చేసుకుంటారు. ఆలయ శిఖరంపై ఎగురవేసే 14 మూరల పతాకాన్ని అర్చకులు ప్రతిరోజూ మారుస్తారు. సాయంత్రం 5 గంటలకు కొత్త జెండా ఎగురవేస్తారు. భక్తులు సమర్పించే జెండాలను చక్రం దిగువన కడతారు.

Related posts

చోరీకి వచ్చి నిద్రపోయిన దొంగ.. మర్నాడు ఉదయం అరెస్టు…

Ram Narayana

మనవరాలి జననంపై సునీల్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!

Ram Narayana

అతను 180 మంది పిల్లలకు తండ్రి.. ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట!

Ram Narayana