ఐపీఎల్ ప్లేఆప్స్ మొదటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను భారీ తేడాతో ఓడించి ఆర్సిబి ఫైనల్ చేరుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన ఆర్ సి బి నిర్ణీత 20 ఓవర్లలో 256 పరుగుల భారీ స్కోర్ చేసింది.. కెప్టెన్ పటే దార్ బాధ్యతాయుతంగా ఆడి కేవలం 33 బంతుల్లో 93 పరుగులు చేసి తమ జట్టుకు భారీ ఆదిత్యాన్ని అందించారు ఇందులో తొమ్మిది సిక్సులు ఉండటం గమనహారము.. అనంతరం చేదనకు దిగిన గుజరాత్ ఆరంభంలో నే వికెట్లను త్వర త్వరగా కోల్పోయి చిక్కుల్లో పడింది. దీంతో మ్యాచ్ ఏ సందర్భంలోనూ వారికి అనుకూలంగా లేకుండా పోయింది. అయితే చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన తేవాటియ మెరుపులు మెరిపించినప్పటికీ అప్పటికే మ్యాచ్ చేయి దాటిపోయింది దీంతో భారీ ఆదిక్యంతో ఆర్సిబి ఫైనల్కు దూసుకెళ్లింది.