జాతీయ వార్తలు

ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు…

  • అక్టోబర్ 12 – 27 మధ్య మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్శిటీ బృందం సాహస యాత్ర
  • ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకుని అరుదైన ఘనత సాధించిన విద్యార్ధులు
  • దేశంలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకున్న తొలి ప్రైవేటు విద్యాసంస్థ బృందం తమదేనని వెల్లడి

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీకి చెందిన పలువురు అధ్యాపకులు, విద్యార్ధులు సాహస యాత్ర చేశారు. ఈ సాహస యాత్రలో భాగంగా ఈ బృందం ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకుని అరుదైన ఘనతను సాధించింది. 

వర్శిటీ డైరెక్టర్ సిద్ధార్థ త్రిపాఠి నాయకత్వంలో మొత్తం 18 మంది అధ్యాపకులు, విద్యార్ధులు ఈ నెల 12న అమరావతి నుంచి బయలుదేరారు. అక్టోబర్ 20న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు ఈ బృందం చేరుకుంది. ఈ బృందం తొలుత ఖాట్మాండుకు చేరుకుంది. అక్కడ నుంచి 134 కిలోమీటర్లు ప్రయాణించి ..5,364 మీటర్ల (17,598 అడుగులు) ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్‌ క్యాంపునకు చేరుకుంది. 

ఈ సాహస యాత్ర అక్టోబర్ 12 – 27 మధ్య జరిగింది. ఈ సందర్భంగా వర్శిటీ ప్రతినిధులు మాట్లాడుతూ .. దేశంలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకున్న తొలి ప్రైవేటు విద్యాసంస్థ బృందం తమదేనని తెలిపారు. 

Related posts

సీజేఐపై దాడి.. పశ్చాత్తాపం లేదు, దేవుడే చేయించాడు: న్యాయవాది రాకేశ్ కిశోర్

Ram Narayana

నిఫా ఎఫెక్ట్: ఎయిర్‌పోర్టుల్లో మళ్లీ కొవిడ్ తరహా స్క్రీనింగ్…

Ram Narayana

 ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం .. ద‌ర్యాప్తునకు ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీ

Ram Narayana