Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించిన కేంద్రం

  • ఏపీలో మిర్చి రైతుల పరిస్థితిపై కేంద్రానికి చంద్రబాబు లేఖ
  • కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ మాట్లాడిన ఏపీ సీఎం
  • క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించిన కేంద్రం

ఏపీ మిర్చి రైతుల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ మిర్చి రైతుల అంశంపై మాట్లాడారు. 

ఈ నేపథ్యంలో, చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. ఏపీ మిర్చి రైతుల పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించింది. క్వింటా మిర్చికి రూ.11,781 ధర ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద ఈ మేరకు మిర్చికి ధరను ప్రకటించింది. ఈ ధరను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరించనున్నాయి.  

కాగా, ఏపీ నుంచి 2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు కేంద్రం అవకాశం కల్పించింది. 2024-25 సీజన్ లో పండిన మిర్చికి వర్తించేలా తాజా ఉత్తర్వులు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని తెలుస్తోంది.

Related posts

మరుగుతున్న నీళ్లు జార విడిచిన ఎయిర్‌హోస్టస్.. ఎయిర్ ఇండియా ప్రయాణికురాలికి గాయాలు

Ram Narayana

కాంగ్రెస్ నేత హిమానీ న‌ర్వాల్ హ‌త్య కేసు… పోలీసుల అదుపులోకి నిందితుడు స‌చిన్‌!

Ram Narayana

ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ!

Ram Narayana

Leave a Comment